News December 10, 2025

అనకాపల్లి: ‘వాట్సాప్‌లో Hi అని మెసేజ్ చేసి ఫిర్యాదు చేయొచ్చు’

image

అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం మొబైల్ రికవరీ మేళా నిర్వహించి రూ.1.50 కోట్లు విలువైన 750 మొబైల్స్‌ను ఎస్పీ తుహీన్ సిన్హా బాధితులకు అందజేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 11 రికవరీ మేళాలు జరిగాయన్నారు. ఈ ఏడాదిలో 3 రికవరీ మేళాలు నిర్వహించి 1,880 ఫోన్లు అప్పగించినట్లు పేర్కొన్నారు. జిల్లా పోలీస్ వాట్సాప్ 9346912007 నంబర్‌కు Hi అని మెసేజ్ చేసి వచ్చే లింక్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చునన్నారు.

Similar News

News December 10, 2025

చిన్నారులకు విటమిన్ డి ఎందుకు అవసరమంటే?

image

పిల్లల ఎముకలు,కండరాల ఆరోగ్యం విషయంలో విటమిన్ D పాత్ర చాలా ముఖ్యమైనది. రోగనిరోధక వ్యవస్థ పనితీరుతో పాటు మొత్తం శరీర ఆరోగ్యంలో D విటమిన్ కీలకపాత్ర పోషిస్తుంది. విటమిన్ D లోపం కారణంగా అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి. కీళ్ల నొప్పులు, నిరంతరం అలసట, జుట్టు పల్చబడటం, గాయాలు నెమ్మదిగా మానడం మొదలైనవి విటమిన్ D లోపానికి సంకేతాలు. ఈ లక్షణాలు పిల్లల ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపిస్తాయి.

News December 10, 2025

పెంబి: తెప్పపై తరలివెళ్లిన ఎన్నికల సిబ్బంది

image

ఈ నెల 11న నిర్వహించనున్న పంచాయతీ ఎన్నికల్లో భాగంగా జిల్లా ఎన్నికల పరిశీలకురాలు ఆయేషా మసరత్ ఖానం పెంబి మండలాన్ని సందర్శించారు. సిబ్బంది ఎన్నికల సామగ్రితో కేంద్రాలకు తరలివెళ్లారు. యాపాల్ గూడకు వెళ్లాల్సిన సిబ్బందిని గ్రామంలోని నది వద్ద తెప్పపై సామగ్రితో దగ్గరుండి తరలించారు.

News December 10, 2025

మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రిలో స్క్రబ్ టైఫస్‌తో మహిళ మృతి.?

image

కృత్తివెన్ను మండలం అడ్డపర్రకు చెందిన ఓ మహిళ (55) స్క్రబ్ టైఫస్‌ అనుమానిత లక్షణాలతో మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరణించారు. జ్వరం, శరీర నొప్పులతో ఆసుపత్రికి తరలించగా, పరీక్షల్లో స్క్రబ్ టైఫస్‌ లక్షణాలు ఉన్నట్లు సమాచారం. అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నప్పటికీ, ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు.