News January 25, 2025
అనకాపల్లి: ‘విజయ సాయి రెడ్దిది రాజీనామా డ్రామా’

రాజీనామాతో చేసిన తప్పుల నుంచి తప్పించుకునే డ్రామా చేస్తున్నారని విజయసాయి రెడ్డి పై మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్ ఆరోపణలు చేశారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్గా మూడున్నర సంవత్సరాలు వైసీపీ అంటే విజయసాయిరెడ్డి అన్నట్టుగా ఆయన హవా సాగిందని, దోచుకున్న దోపిడీలలో అరెస్టు భయంతేనె ఈ డ్రామాలకు తెర లేపారని ఆయన విమర్శించారు.
Similar News
News February 19, 2026
రాగికి పెరుగుతున్న డిమాండ్

ఎలక్ట్రికల్, నిర్మాణ, రవాణా తదితర రంగాల్లో రాగిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. వాడకం విపరీతంగా పెరుగుతుండడంతో 2040 నాటికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ 42 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరుకునే అవకాశం ఉందని ఎస్ అండ్ పీ గ్లోబల్ రిపోర్ట్ వెల్లడించింది. సప్లైలో తగినంత వృద్ధి లేకపోతే 2040 నాటికి 10 మెట్రిక్ టన్నుల కొరత ఏర్పడవచ్చని అంచనా. ప్రస్తుతం టన్ను కాపర్ ధర దాదాపు 13వేల డాలర్లు (₹11,80,000) ఉంది.
News February 19, 2026
ఖమ్మం: భోజనం చేస్తూ వ్యక్తి గుండెపోటుతో మృతి

కారేపల్లి మండలం దుబ్బతండాకు చెందిన శ్రీను (38) మణుగూరులోని బంధువుల ఇంట్లో భోజనం చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మరణించారు. బంధువులు వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. శ్రీను ఆకస్మిక మరణంతో దుబ్బతండా గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
News February 19, 2026
సన్నబియ్యం పంపిణీలో పోర్టబిలిటీ తిప్పలు

ఖమ్మం జిల్లాలో సన్నబియ్యం పంపిణీ ప్రక్రియలో లబ్ధిదారులు, డీలర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోర్టబిలిటీ సౌకర్యం కారణంగా ఇతర ప్రాంతాల వారు రావడంతో స్థానిక కార్డుదారులకు బియ్యం అందక డీలర్లతో వాగ్వాదానికి దిగుతున్నారు. అక్రమాలను అరికట్టేందుకే ‘స్లాబ్’ విధానం అమలు చేస్తున్నామని అధికారి చందన్ కుమార్ తెలిపారు. ఇండెంట్ ప్రకారమే బియ్యం కేటాయిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.


