News October 8, 2025
అనకాపల్లి: వేతనదారులకు ముఖ ఆధారిత హాజరు

ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న వేతన దారులకు ముఖ ఆధారిత హజరు అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు డ్వామా పీడీ పూర్ణిమా దేవి తెలిపారు. వేతనదారుని ముఖమును ఆధార్ కార్డులో ఉన్న ముఖముతో పోల్చి నమోదు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఒకరికి బదులుగా మరొకరు పనిలోకి రాకుండా నియంత్రించినందుకు ఈ విధానాన్ని అమలులోకి తీసుకు వస్తున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా జిల్లాలో ప్రతి గ్రామంలోనూ E-KYC జరుగుతున్నట్లు తెలిపారు.
Similar News
News October 8, 2025
MBNR: ఎన్నికల నిబంధనలపై అవగాహన ఉండాలి: కలెక్టర్

మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి మంగళవారం ఎన్నికల ప్రొసీడింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా జరిగేందుకు కృషి చేయాలని కోరారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నిబంధనలపై అధికారులకు పూర్తి అవగాహన తప్పనిసరి అని ఆమె పేర్కొన్నారు.
News October 8, 2025
MBNR: దసరా EFFECT.. రూ.33 కోట్ల 65 లక్షల ఆదాయం

దసరా పండుగ సందర్భంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పది డిపోలలో రూ.33 కోట్ల 65 లక్షల ఆదాయం వచ్చినట్లు మహబూబ్ నగర్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ పి.సంతోష్ కుమార్ Way2Newsతో తెలిపారు. గత నెల 20 నుండి ఈ నెల 6 వరకు 14 రోజుల్లో బస్సులను 53.07 లక్షల కిలోమీటర్లు తిప్పి.. రూ.33 కోట్ల 65 లక్షల ఆదాయం వచ్చిందని, ఈ మేరకు కండక్టర్లు, డ్రైవర్లు, ప్రతి ఆర్టీసీ ఉద్యోగికి ప్రత్యేక అభినందనలని ఆర్ఎం తెలిపారు. SHARE IT
News October 8, 2025
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

కుప్పం – పలమనేరు జాతీయ రహదారిలోని సామగుట్టు పల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం చెందాడు. ద్విచక్ర వాహనాన్ని బొలెరో వాహనం ఢీకొనడంతో కుప్పం మండలం నూలుకుంట కు చెందిన వెంకటేష్ తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ఏరియా ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.