News December 12, 2025
అనకాపల్లి: సమస్యల పరిష్కరించాలని అంగన్వాడీల ఆందోళన

సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అనకాపల్లి కలెక్టరేట్ వద్ద శుక్రవారం ధర్నా చేపట్టారు. ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింగరావు మాట్లాడుతూ.. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అంగన్వాడీలకు వేతనాలు పెంచాలన్నారు. 2023లో 42 రోజులు పాటు సమ్మె చేసిన అంగన్వాడీలకు వేతనాలు పెంచుతామని అప్పటి ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు.
Similar News
News December 13, 2025
రాష్ట్రంలో 60 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

<
News December 13, 2025
NZB: మద్యం దుకాణాలు బంద్

2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మద్యం దుకాణాలను మూసి వేయనున్నామని NZB జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి శుక్రవారం తెలిపారు. 14వ తేదీ ఎన్నికల కౌంటింగ్ ముగిసే వరకు నిజామాబాద్ రూరల్, ధర్పల్లి, డిచ్పల్లి, ఇందల్వాయి, మాక్లూర్, మోపాల్, సిరికొండ, జక్రాన్పల్లి మండలాల పరిధిలో మద్యం దుకాణాలు మూసి ఉంచనున్నట్లు తెలిపారు.
News December 13, 2025
ఆసిఫాబాద్: ఎన్నికలు.. అక్క(BRS) Vs చెల్లి (కాంగ్రెస్)

ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం గాడపల్లి గ్రామపంచాయతీ ఎన్నికల బరిలో సొంత అక్కాచెల్లెళ్లు నిలవడం చర్చనీయాంశంగా మారింది. అక్క శంకరమ్మ BRS బలపరుస్తున్న అభ్యర్థిగా పోటీ చేస్తుండగా, చెల్లి విమల కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా బరిలో ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటం తమకు కలిసివచ్చే అంశంగా విమల భావిస్తున్నారు. ఇద్దరూ పోటీలో ఉండటంతో గాడపల్లి పంచాయతీ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది.


