News March 13, 2026
అనకాపల్లి: 124 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షకు గైర్హాజరు

అనకాపల్లి జిల్లాలో శుక్రవారం జరిగిన ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షకు 124 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు డీఐఈవో వినోద్ బాబు శుక్రవారం తెలిపారు. మొత్తం 8,888 మంది హాజరు కావలసి ఉండగా 8,764 మంది పరీక్ష రాసినట్లు వెల్లడించారు. పరీక్షలు ప్రశాంతంగా, పకడ్బందీగా జరుగుతున్నట్లు తెలిపారు. ఎటువంటి మాస్ కాపీయింగ్కు అవకాశం లేకుండా పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు.
Similar News
News April 14, 2026
మరోసారి శాంతి చర్చలు..? తగ్గిన క్రూడాయిల్ ధర

అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు ఊగిసలాడుతున్నాయి. మరోసారి US-ఇరాన్ శాంతి <<19644378>>చర్చలకు<<>> అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో ఇవాళ రేట్లు తగ్గాయి. నిన్న $100 పైగా ఎగిసిన బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ రేట్ $97కు పడిపోయింది. నేచురల్ గ్యాస్, గ్యాసోలిన్, హీటింగ్ ఆయిల్ ధరలు కూడా కాస్త దిగివచ్చాయి. అయితే నిన్న స్వల్పంగా తగ్గిన గోల్డ్, సిల్వర్ రేట్లు మాత్రం మళ్లీ పెరుగుదల బాట పట్టాయి.
News April 14, 2026
మరోసారి శాంతి చర్చలు..? తగ్గిన క్రూడాయిల్ ధర

అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు ఊగిసలాడుతున్నాయి. మరోసారి US-ఇరాన్ శాంతి <<19644378>>చర్చలకు<<>> అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో ఇవాళ రేట్లు తగ్గాయి. నిన్న $100 పైగా ఎగిసిన బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ రేట్ $97కు పడిపోయింది. నేచురల్ గ్యాస్, గ్యాసోలిన్, హీటింగ్ ఆయిల్ ధరలు కూడా కాస్త దిగివచ్చాయి. అయితే నిన్న స్వల్పంగా తగ్గిన గోల్డ్, సిల్వర్ రేట్లు మాత్రం మళ్లీ పెరుగుదల బాట పట్టాయి.
News April 14, 2026
కలెక్టరేట్లో ఉద్యోగాలంటూ SMలో వైరల్.. ఖండించిన కలెక్టర్

జిల్లా కలెక్టరేట్లో రాత పరీక్ష లేకుండా 40 పోస్టుల భర్తీ అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఖండించారు. ఈ వీడియోలు పూర్తిగా అవాస్తవమని, నిరుద్యోగులు వీటిని నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. ఉద్యోగాల పేరిట ఎవరైనా డబ్బులు అడిగితే నమ్మవద్దని, ఏదైనా సమాచారం ఉంటే ఒకటికి రెండుసార్లు అధికారికంగా సరిచూసుకోవాలని ఆమె సూచించారు. నకిలీ వార్తలపై అప్రమత్తంగా ఉండాలన్నారు.


