News February 17, 2026
అనకాపల్లి: 21న జడ్పీ స్థాయి సమావేశాలు

ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలు ఈనెల 21వ తేదీన నిర్వహించనున్నట్లు సీఈవో నారాయణమూర్తి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. జడ్పీ ఛైర్పర్సన్ సుభద్ర అధ్యక్షతన విశాఖ జడ్పీ కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి సమావేశాలు ప్రారంభం అవుతాయన్నారు. ఈ మేరకు జడ్పీటీసీలు, ఎంపీపీలు హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. అధికారులు పూర్తి సమాచారంతో సమావేశానికి రావాలన్నారు.
Similar News
News February 17, 2026
సభకు రాని MLAలను రికాల్ చేయాలి: స్పీకర్

AP: సభకు హాజరుకాని MLAలను రికాల్ చేయాల్సిన అవసరం ఉందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అభిప్రాయపడ్డారు. ‘8 దేశాల్లో ఈ విధానం ఉంది. కొందరు MLAలు సభకు రాకుండా జీతాలు తీసుకుంటున్నారు. విధులకు రాకపోతే ఉద్యోగుల జీతాల్లో కోత వేస్తున్నాం. అలాగే వీరి శాలరీ ఎందుకు కట్ చేయకూడదు’ అని ప్రశ్నించారు. సభలో MLAల కన్నా మాక్ అసెంబ్లీలో విద్యార్థులే బాగా మాట్లాడారని తెలిపారు. ఇక డిజిటల్ అటెండెన్స్ పనితీరు బాగుందన్నారు.
News February 17, 2026
మ.1.30 గం. వరకే స్కూళ్లు

TG: రంజాన్ సందర్భంగా ఉర్దూ మీడియం పాఠశాలల సమయాల్లో మార్పులు చేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఉ.8 గం. నుంచి మ.1.30 గం. వరకు మాత్రమే స్కూళ్లు నడుస్తాయని పేర్కొంది. ఈ కొత్త వేళలు ఫిబ్రవరి 19 నుంచి మార్చి 20 వరకు అమల్లో ఉంటాయని తెలిపింది. అటు ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లోని ముస్లిం ఉద్యోగులు ఈ మాసంలో 4PM కల్లా విధులు ముగించి వెళ్లేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
News February 17, 2026
TDR బ్యాంక్@2026.. కాగితం ముక్క ఇక కరెన్సీ నోటుతో సమానం!

మూసీ బాధితులకు ఇచ్చే TDR బాండ్ల విషయంలో ప్రభుత్వం విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకోబోతోంది. ఈ బాండ్లను బాధితులు బిల్డర్లకు అమ్ముకోవాల్సి వచ్చేది. అక్కడ వాళ్లు మోసపోయే అవకాశం ఉండేది. దీనికి చెక్ పెడుతూ సర్కారే ఒక ‘డిజిటల్ TDR ఎక్స్ఛేంజ్’ను ఏర్పాటు చేయబోతోంది. ఇది పారదర్శకతను పెంచుతుందని చెప్తున్నా మార్కెట్ రేటును ప్రభుత్వం నియంత్రించడం వల్ల బాధితులకు ఆశించిన ధర దక్కుతుందా? లేదా? అన్నది ప్రశ్నార్థకమే.


