News February 24, 2026
అనకాపల్లి: 219 మంది ఇంటర్ విద్యార్థులు గైర్హాజర్

అనకాపల్లి జిల్లాలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా ప్రారంభం అయినట్లు డీఐఈఓ ఎం.వినోద్ బాబు ఓ ప్రకటనలో తెలిపారు. 34 పరీక్షా కేంద్రాల్లో 12,422 మంది హాజరుకావాల్సి ఉండగా 219 మంది విద్యార్థులు గైర్హాజర్ అయినట్లు తెలిపారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్కు అవకాశం లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశామన్నారు.
Similar News
News March 1, 2026
ఈ రంగు కార్లలో మరింత వేడి!

వేసవిలో కారు రంగు ఏసీ పనితీరుపై ప్రభావం చూపుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. తెలుపు వంటి లేత రంగులు సూర్యరశ్మిని పరావర్తనం చేయడంతో క్యాబిన్ త్వరగా చల్లబడుతుంది. కానీ నలుపు వంటి ముదురు రంగులు వేడిని ఎక్కువగా గ్రహిస్తాయి. దీనివల్ల కారు లోపల ఉష్ణోగ్రత 5-10 డిగ్రీలు ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా ముదురు రంగు కార్లలో AC కూలింగ్ ఆలస్యమవ్వడమే కాకుండా కంప్రెషర్పై భారం పడి మైలేజీ స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది.
News March 1, 2026
నారాయణపేట జిల్లాలో పోలీస్ యాక్ట్ 30 అమలు

జిల్లాలో ఇవాళ్టి నుంచి ఈనెల 31వరకు పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉంటుందని నారాయణపేట ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. పోలీసుల అనుమతులు లేకుండా రాజకీయ పార్టీలు, యువజన, కార్మిక, విద్యార్థి, రైతు సంఘాల నేతలు ఎలాంటి నిరసన కార్యక్రమాలు, ధర్నాలు, బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించరాదని చెప్పారు. మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News March 1, 2026
ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్లో 100 పోస్టులు

ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్(<


