News March 15, 2025

అనకాపల్లి: 331 మంది విద్యార్థులు గైర్హాజరు

image

అనకాపల్లి జిల్లాలో శనివారం జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షకు 331 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి సుజాత ఓ ప్రకటనలో తెలిపారు. జనరల్ విద్యార్థులు 9,720 మంది హాజరు కావాల్సి ఉండగా 9,505 మంది హాజరైనట్లు తెలిపారు. ఒకేషనల్ విద్యార్థులు 1,932 మంది హాజరుకావాల్సి ఉండగా 1,816 మంది హాజరైనట్లు తెలిపారు.

Similar News

News December 20, 2025

పొగమంచు అడ్డంకి.. మోదీ చాపర్ యూటర్న్

image

PM మోదీ పర్యటనకు పొగమంచు అడ్డంకిగా మారింది. కోల్‌కతా విమానాశ్రయం నుంచి పశ్చిమ బెంగాల్ నాడియా జిల్లాలోని తాహెర్‌పుర్ హెలిప్యాడ్‌కు బయల్దేరిన మోదీ హెలికాప్టర్ దట్టమైన పొగమంచు కారణంగా ల్యాండ్ కాలేకపోయింది. కొద్దిసేపు చక్కర్లు కొట్టిన తర్వాత చాపర్ తిరిగి కోల్‌కతాకు వెళ్లిపోయింది. NH ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన PM, వాతావరణం అనుకూలించక వర్చువల్‌గానే మాట్లాడారు.

News December 20, 2025

యాషెస్ మూడో టెస్ట్.. గెలుపు దిశగా ఆసీస్

image

యాషెస్ 3rd టెస్టులో ఆస్ట్రేలియా విజయానికి 4 వికెట్ల దూరంలో ఉంది. 4th రోజు ఆట ముగిసే సమయానికి ENG రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు కోల్పోయి 207 రన్స్ చేసింది. J స్మిత్(2), జాక్స్(11) క్రీజులో ఉన్నారు. జాక్ క్రాలీ 85 పరుగులతో రాణించారు. కమిన్స్, లయన్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. ENG గెలవాలంటే ఇంకా 228 రన్స్ చేయాలి. ఇప్పటికే తొలి 2 టెస్టులు గెలిచిన AUS ఈ మ్యాచ్ కూడా గెలిస్తే సిరీస్ సొంతం చేసుకుంటుంది.

News December 20, 2025

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

<>నేషనల్<<>> ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీలో 12 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 22వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి లైఫ్ సైన్స్ /బయో టెక్నాలజీ/కెమికల్ /కంప్యూటేషనల్ & ఇన్‌ఫర్మేషన్ /ఫార్మాస్యూటికల్/వెటర్నరీ విభాగంలో PhD ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.nii.res.in