News March 23, 2025

అనకాపల్లి: 4 ఎంపీపీ.. 2 వైస్ ఎంపీపీ ఎన్నికకు నోటిఫికేషన్

image

అనకాపల్లి జిల్లాలో ఈనెల 27న 4 MPP, 2 వైస్ ఎంపీపీ, ఒక కో ఆప్షన్ స్థానాలకు ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ సీఈవో పి నారాయణమూర్తి శనివారం తెలిపారు. ఎన్నికలకు సంబంధించి ఎంపీ, ఎమ్మెల్యే, ఎంపీటీసీలు, కోఆప్షన్ సభ్యులకు నోటీసు ద్వారా సమాచారం అందించినట్లు తెలిపారు. ఈనెల 27 ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట లోపు నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ అనంతరం ఎన్నిక జరుగుతుందన్నారు.

Similar News

News November 9, 2025

ALERT.. వచ్చే 8 రోజులు జాగ్రత్త!

image

TG: ఈ నెల 11 నుంచి 19 వరకు చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు వెల్లడించారు. ADB, కొమురం భీమ్, నిర్మల్, NZB, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌‌కు (10°C కంటే తక్కువ) పడిపోవచ్చని అంచనా వేశారు. దక్షిణ, తూర్పు జిల్లాల్లో మోస్తరు చలి, ఉష్ణోగ్రతలు 14°C-17°C మధ్య ఉండవచ్చని పేర్కొన్నారు.

News November 9, 2025

6,000 మందితో గీతా పారాయణం

image

విశాఖపట్నంలోని పోర్ట్ ఇన్‌డోర్ స్టేడియంలో ఆదివారం భగవద్గీత పారాయణం నిర్వహించారు. గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆధ్వర్యంలో 6,000 మందికి పైగా భక్తులు ఏకస్వరంతో 700 శ్లోకాల భగవద్గీత పారాయణం చేశారు. 3 గంటలకు పైగా సాగిన ఈ మహా పారాయణంలో గీతా శ్లోకాలు ప్రతిధ్వనిస్తూ ఈ కార్యక్రమం సాగింది. ఈ కార్యక్రమాన్ని ఓ ఫౌండేషన్-అవధూత దత్త పీఠం నేతృత్వంలో నిర్వహించారు.

News November 9, 2025

మరిపెడ: ఆటో, బైక్ ఢీ.. ఒకరు మృతి

image

మరిపెడ మండలం బురహానుపురం శివారులోని జాతీయ రహదారిపై సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మరిపెడ ఎస్సై వీరభద్రరావు తెలిపిన వివరాలిలా.. సూర్యాపేట జిల్లా ఇటిక్యాలపల్లికి శివరాత్రి చందు(25), ఖమ్మం జిల్లా సిరిపురం వాసి రాము బైక్‌పై బురహానుపురం నుంచి మరిపెడకు వెళ్తుండగా ఆటోను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో చందు దుర్మరణం చెందగా, గాయపడిన రామును ఆస్పత్రికి తరలించారు.