News October 8, 2025
అనకాపల్లి: ‘PGRS అర్జీలను ఆన్లైన్లో నమోదు చేయాలి’

మండల, డివిజన్ స్థాయిలో పీజీఆర్ఎస్ ద్వారా వచ్చిన అర్జీలను ఆన్లైన్లో నమోదు చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. వచ్చిన ప్రతి అర్జీకి రసీదు ఇవ్వాలన్నారు. బుధవారం అనకాపల్లి కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మండల స్థాయి సమన్వయ కమిటీ ద్వారా సివిల్ తగాదాలను పరిష్కరించాలని సూచించారు. నీటితీరువా, కోర్టు కేసులు, స్మార్ట్ కార్డుల పంపిణీ వివరాలు తెలుసుకున్నారు.
Similar News
News October 8, 2025
KMR: కలెక్టర్ చొరవ.. బాలికలకు ISRO టూర్

కామారెడ్డి జిల్లా చరిత్రలో తొలిసారిగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ చొరవతో 10వ తరగతి చదువుతున్న 30 మంది బాలికలను ప్రభుత్వ ఖర్చుతో ISRO టూర్కు తీసుకెళ్లనున్నట్లు జిల్లా విద్యాధికారి రాజు పేర్కొన్నారు. ఈ పర్యటన కోసం బుధవారం స్పేస్ సైన్స్ క్విజ్ కాంపిటీషన్ నిర్వహించామన్నారు. ఇలాంటి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కలెక్టర్కు జిల్లా విద్యార్థులు, విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు తెలిపారు.
News October 8, 2025
KMR: ఎన్నికల కోడ్ను అమలు చేయాలి: SEC

ZPTC, MPTC, MPP ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల అధికారిణి రాణి కుముదిని, హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ.. మొదటి విడతలో 14 జడ్పీటీసీ, 136 ఎంపీటీసీ స్థానాల నోటిఫికేషన్ సిద్ధంగా ఉందని తెలిపారు. గురువారం నోటిఫికేషన్ జారీ చేసి, నామినేషన్ల స్వీకరణకు సిద్ధంగా ఉన్నామని వివరించారు.
News October 8, 2025
యాక్టింగ్ PMలా అమిత్ షా తీరు: మమత

కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై WB CM మమత ఫైరయ్యారు. ఆయనో యాక్టింగ్ PMలా మారారని దుయ్యబట్టారు. ‘షాను ఎక్కువగా నమ్మొద్దని PMకి చెప్పాలనుకుంటున్నా. ప్లాసీ యుద్ధంలో బెంగాల్ నవాబ్ సిరాజుద్దౌలాను మోసగించి రాజైన మిర్ జాఫర్ లాంటి వ్యక్తి షా. విచిత్రమేమంటే ఆయన గురించి ఈ విషయాలు మోదీకి కూడా తెలుసు’ అని మమత వ్యాఖ్యానించారు. అమిత్ షా కోరిక మేరకే CEC SIR పేరిట ఓటర్ లిస్టుల సవరణ నిర్వహిస్తోందని విమర్శించారు.