News February 23, 2025
అనకాపల్లి: TODAY TOP NEWS

*నర్సీపట్నంలో ఉచిత చికెన్ ఫ్రై, కోడిగుడ్లు పంపిణీ * అనకాపల్లి: ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ * మాడుగుల: వచ్చే నెల 14న పశువుల పాల పోటీలు *కళకళలాడుతున్న పెదబొడ్డేపల్లి ఫిష్ మార్కెట్ * మాకవరపాలెం ఎంపీడీవో ఇంటింటా ప్రచారం *జాతరను తలపించిన తుమ్మపాల చేపల బజార్ *కృష్ణదేవిపేట చేరుకున్న అల్లూరి శత వర్ధంతి జాతా *మయన్మార్లో చిక్కుకున్న బూరుగుపాలెం యువకులు
Similar News
News November 3, 2025
జనగామ జిల్లాలో వర్షపాతం నమోదు వివరాలు

జనగామ జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 42.2 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పాలకుర్తిలో 2.8, జఫర్గఢ్ 3.8, కొడకండ్ల 8.2, తరిగొప్పుల 15.2, నర్మెట్ట 8.6, జనగామ 1.4, రఘునాథపల్లి 1.2, లింగలఘనపూర్ 1.0మి.మీ వర్షపాతం నమోదయిందన్నారు.
News November 3, 2025
విశాఖలో దంపతుల మృతిపై వీడని మిస్టరీ

అక్కయ్యపాలెం సమీపంలో భార్యాభర్తలు వాసు, అనిత <<18182096>>మృతిపై<<>> పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఘటనాస్థలంలో బెడ్పై అనిత మృతదేహం, వాసు ఉరితాడుకు వేలాడడం అనుమానాలకు తావిస్తోంది. భార్యను చంపిన అనంతరం వాసు ఆత్మహత్య చేసుకున్నాడా? లేక వేరే ఏదైనా కారణం ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల వివాహం జరగగా వారి మధ్య ఎలాంటి గొడవలు లేవని బంధువులు పోలీసులకు చెప్పినట్లు సమాచారం.
News November 3, 2025
ఘోర ప్రమాదాలు.. 10 రోజుల్లో 60 మంది దుర్మరణం!

దేశంలో రోడ్డు ప్రమాదాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. గత పది రోజుల్లో జరిగిన వేర్వేరు ఘోర ప్రమాదాల్లో దాదాపు 60మంది దుర్మరణం పాలయ్యారు. ఇవాళ రంగారెడ్డి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో 21 మంది ప్రయాణికులు మరణించారు. ఇంతకుముందు కర్నూలులో 20, రాజస్థాన్లో 15, బాపట్లలోని సత్యవతిపేట వద్ద జరిగిన కారు ప్రమాదంలో 4 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వరుస ఘటనలు ప్రయాణ భద్రతపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.


