News October 22, 2025

అనిత సహనం కోల్పోతే పవన్‌కు గడ్డు పరిస్థితులు: మేడా

image

పిఠాపురంలో జరుగుతున్న నేరాలపై దృష్టి సారించకుండా, భీమవరంలో జూదాల కోసం డీఎస్పీ జయసూర్యపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అవ్వడం హాస్యాస్పదమని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం రాజమండ్రిలో ఆయన మాట్లాడారు. హోం మంత్రి అనిత శాఖనే పవన్ కళ్యాణ్ ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు. అనిత సహనం కోల్పోతే పవన్‌కు గడ్డు పరిస్థితులు తప్పవన్నారు.

Similar News

News February 22, 2026

పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్: SP

image

తూ.గో జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షల కోసం అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని SP నరసింహ ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు నిర్ణీత సమయానికి చేరుకోవాలని, సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. కేంద్రాల చుట్టుపక్కల జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. నిరంతర నిఘా ఉంటుందని పేర్కొన్నారు.

News February 22, 2026

నల్లజర్ల: నడుచుకుంటూ వెళ్తూ వ్యక్తి మృతి

image

నల్లజర్ల మండలం ముసుళ్లకుంటలో ఆదివారం విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ గుర్తు తెలియని వ్యక్తి నడుచుకుంటూ వెళ్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలి ప్రాణాలు విడిచాడని స్థానికులు తెలపారు. ఘటనా స్థలానికి చేరుకున్న నల్లజర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. మరణానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు.

News February 22, 2026

నిడదవోలులో ప్లాస్టిక్ గ్రహీత దిశగా అడుగు: మంత్రి దుర్గేష్

image

నిడదవోలు మండలం సమిశ్రగూడెం గ్రామంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద శనివారం సాయంత్రం మంత్రి దుర్గేష్ స్వచ్ఛ రథం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఈ కార్యక్రమంతో గ్రామాల పరిస్థితి మెరుగుపడుతుందని, ప్లాస్టిక్ రహితంగా మారేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లు, తదితర వ్యర్థాలను స్వచ్చ రథాలకు ఇస్తే నిత్యవసర సరకులను ఉచితంగా ఇస్తారని అన్నారు.