News January 12, 2026
అనిల్ రావిపూడి రికార్డ్.. రాజమౌళి తర్వాత

డైరెక్టర్ అనిల్ రావిపూడి-చిరంజీవి కాంబోలో వచ్చిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం <<18832382>>పాజిటివ్<<>> టాక్ సొంతం చేసుకుంది. దీంతో ఈ యంగ్ డైరెక్టర్ టాలీవుడ్లో రాజమౌళి తర్వాత మోస్ట్ సక్సెస్ఫుల్ దర్శకుడిగా నిలిచారు. ‘పటాస్(2015)’ నుంచి ఇవాళ రిలీజైన ‘MSVPG’ వరకు మొత్తం 9 సినిమాల్లోనూ హిట్ కొట్టిన దర్శకుడిగా పేరొందారు. నాగార్జునతోనూ మూవీ చేస్తే నలుగురు సీనియర్ హీరోలతో పని చేసిన యువ దర్శకుడిగా మరో ఘనత సాధిస్తారు.
Similar News
News February 5, 2026
పశువుల పాలు పితికిన తర్వాత జాగ్రత్తలు

పాలు పితికిన తర్వాత పశువును అరగంట వరకు నేలపై పడుకోనీయకూడదు. పాలు పితకడం వల్ల పశువుల చనురంధ్రాలు తెరచుకొని ఉంటాయి. అప్పుడు ఆవు/గేదె పడుకుంటే ఆ రంధ్రాల నుంచి బ్యాక్టీరియా త్వరగా పొదుగులో చేరి పొదుగువాపు వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఒక పశువు పాలు తీసిన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కున్న తర్వాతే మరో పశువు పాలు తీయాలి. దీని వల్ల ఒక పశువుకు ఉన్న అంటువ్యాధులు ఇతర పశువులకు వ్యాపించే ముప్పు తగ్గుతుంది.
News February 5, 2026
సాగునీటి సంఘాల ఛైర్మన్లతో నేడు సీఎం భేటీ

AP: అమరావతి పరేడ్ గ్రౌండ్స్ వేదికగా ఇవాళ సాగునీటి సదస్సు జరగనుంది. రాష్ట్రంలోని 6,047 సంఘాలు, 58 ప్రాజెక్టు కమిటీలు, 267 డిస్ట్రిబ్యూటరీ కమిటీల ఛైర్మన్లు హాజరుకానున్నారు. వారినుద్దేశించి సీఎం చంద్రబాబు ప్రసంగించనున్నారు. ప్రాజెక్టుల యాజమాన్య నిర్వహణ, గ్రామ, మండల, జిల్లా పరిషత్ సమావేశాలకు సాగునీటి సంఘాల ఛైర్మన్లను ప్రత్యేక ఆహ్వానితులుగా పిలవడంపై సీఎం ప్రకటన చేసే అవకాశం ఉంది.
News February 5, 2026
బెంగళూరులో గూగుల్ క్యాంపస్.. 20వేల మందికి ఉద్యోగాలు

వర్క్ వీసా రూల్స్ను US కఠినతరం చేసిన నేపథ్యంలో అవసరమైన నిపుణులను నియమించుకునేందుకు గూగుల్ ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టింది. బెంగళూరులో భారీ క్యాంపస్ నిర్మాణం దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. దాని విస్తీర్ణం 24 లక్షల చదరపు అడుగులని తెలుస్తోంది. ఇది పూర్తయితే దాదాపు 20,000 మంది ఉద్యోగులను కొత్తగా తీసుకునే అవకాశం ఉంది. కాగా ప్రస్తుతం ఇండియాలోని వివిధ నగరాల్లో దాదాపు 14,000 మంది పనిచేస్తున్నారు.


