News March 19, 2024
అనుమానస్పద ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించండి: కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_32024/1710761153385-normal-WIFI.webp)
సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున అనుమానస్పద ఆర్థిక లావాదేవీలు అక్రమంగా డబ్బు తరలింపును కట్టడి చేసేందుకు జిల్లా యంత్రాంగము బ్యాంకర్లు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ స్పష్టం చేశారు. సోమవారం తన ఛాంబర్ లో బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. అనుమానస్పద లావాదేవీలు అంటే జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలన్నారు.
Similar News
News July 3, 2024
శానంపూడి ఎంఎల్హెచ్పీ ఆత్మహత్య
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719953128876-normal-WIFI.webp)
శృంగవరపు కోట మండలం శానంపూడి హెల్త్ సెంటర్లో ఎంఎల్హెచ్పీగా పనిచేస్తున్న రమావంత్ రవినాయక్ (33) ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం రైలు పట్టాలపై రవినాయక్ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు ఆదివారం ఆయన స్కూటీపై వచ్చి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. మృతదేహం కుళ్లిన స్థితిలో ఉందని వారు వెల్లడించారు. పోలీసులు సంఘటనా స్థలం సమీపంలో స్కూటీని గుర్తించారు.
News July 3, 2024
ప్రకాశం: భర్తను హత్య చేయించిన భార్య.. ఎందుకంటే?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719940319887-normal-WIFI.webp)
రాచర్ల మండలం రామాపురం గ్రామంలో జూన్ 29వ తేదీన ఓ వ్యక్తిని హతమార్చిన కేసులో ఇద్దరిని రిమాండ్కు తరలించినట్లుగా డీఎస్పీ బాలసుందరావు మంగళవారం వెల్లడించారు. పొలం పంపకం విషయంలో సొంత భార్య రాజేశ్వరి భర్త స్నేహితుడితో కలిసి భర్తను హత్య చేయించింది. విచారణలో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయని డీఎస్పీ బాలసుందరావు తెలిపారు.
News July 2, 2024
మార్కాపురం: భార్యను చంపిన భర్తకు జైలు శిక్ష
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719929248133-normal-WIFI.webp)
భార్యను హత్య చేసిన కేసులో భర్తకు యావజ్జీవ కారాగార శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ మార్కాపురం కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. మార్కాపురంలోని శరభయ్య మద్యానికి బానిసై భార్యపై అనుమానం పెంచుకున్నాడు. 2019లో భార్య పార్వతి నిద్రిస్తుండగా గొడ్డలి వెనుక భాగంతో తలపై కొట్టడంతో మృతి చెందింది. కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో హాజరపరచగా న్యాయమూర్తి మంగళవారం తీర్పు చెప్పారు.