News March 3, 2025
అనుమానాస్పద కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి: SP

అనుమానాస్పద కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నెల్లూరు జిల్లా ఎస్పీ జి కృష్ణ కాంత్ తెలిపారు. ఏటీఎం, క్రెడిట్, డెబిట్ కార్డులు బ్లాక్ అయ్యాయని, మీ అమౌంట్ రెట్టింపు చేస్తామని వచ్చే కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్డు వివరాలతోపాటు సీవీవీ, ఓటీపీ సమాచారం చెప్పవద్దని అన్నారు. సైబర్ మోసానికి గురి అయితే 1930 నంబర్కు లేదా, సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News December 28, 2025
పెంచలకోనపై వీడని పీటముడి.. అటా.. ఇటా?

కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం అన్నట్లుంది నెల్లూరు జిల్లా పరిస్థితి. గూడూరును నెల్లూరులో కలపడానికే CM సానుకూలత వ్యక్తం చేశారట. వెంకటగిరి నియోజకవర్గంలోని మండలాలపై మాత్రం పీటముడి వీడటం లేదు. కలువాయి, సైదాపురం, రాపూరు మండలాలను నెల్లూరులో కలపాలన్న గట్టి డిమాండ్ ఉంది. కలువాయి(M)న్ని నెల్లూరులో, సైదాపురం, రాపూరు(M)న్ని మాత్రం తిరుపతిలోనే ఉంచనున్నారట. దీంతో పెంచలకోన తిరుపతిలోనే ఉండనుంది.
News December 28, 2025
నెల్లూరు: మాటల్లేవ్.. నిశ్శబ్ద యుద్ధమే..!

అక్కడ పగలు, ప్రతీకారాలు లేవు. పార్టీ ఏదైనా మాటల యుద్ధాలు ఉండవు. అదే ఆత్మకూరు నియోజకవర్గం. ప్రస్తుతం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గం ఒకప్పుడు మేకపాటి కుటుంబం అడ్డా. కానీ గత ఎన్నికల్లో TDP గెలిచింది. అక్కడ TDP-YCP నాయకుల మధ్య ప్రశాంతం వాతావరణం ఉంటుంది. కానీ.. ఎన్నికలంటేనే ప్రధాన పార్టీల మధ్య పోటా పోటీ నెలకొంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
News December 28, 2025
ఇంటింటి సర్వే ప్రక్రియ పరిశీలించిన కలెక్టర్

సచివాలయ సిబ్బందిని నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో సిబ్బందితో కలిసి కలెక్టర్ హిమాన్సు శుక్ల శనివారం పరిశీలించారు. మేక్లిన్స్ రోడ్డులో నివాసాలకు వెళ్లి సర్వే చేస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం సచివాలయాల్లో చిన్న బజార్, దోర్నాల వారి వీధి, టెంకాయల వీధిలోని సచివాలయ సిబ్బందితో హౌస్ హోల్డ్ సర్వే, సిబ్బంది విధులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.


