News October 7, 2025
అన్నమయ్య: అనాథలైన చిన్నారులు

కర్ణాటక సరిహద్దులోని రాయల్పాడు వద్ద నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్నమయ్య జిల్లా రామసముద్రం(M) ఎర్రబోయినపల్లికి చెందిన రామంజులు, అతని భార్య కళావతి మృతిచెందిన విషయం తెలిసిందే. దసరా సెలవులు ముగించుకుని పని నిమిత్తం తిరిగి బెంగళూరుకు బైకుపై బయల్దేరిన దంపతులను టెంపో ఢీకొట్టడంతో ఇద్దరూ చనిపోయారు. వాళ్ల ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Similar News
News October 7, 2025
TDPతో పొత్తు వద్దు: నడ్డాకు BJP నేత రహస్య లేఖ

జూబ్లీహిల్స్లో TDPతో పొత్తు సమీకరణాలపై TBJPలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సుహాసినికి చంద్రబాబు కూటమి టికెట్ ఇప్పిస్తారనే ప్రచారంపై ఓ ముఖ్య నేత JP నడ్డాకు లేఖ రాశారని విశ్వసనీయ సమాచారం. ఈ పొత్తుతో రేవంత్కు AP CM లాభం చేకూర్చారనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయని, ఈ పరిణామం తెలంగాణలో BJP వృద్ధికి అడ్డుగా ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే BJP-PCC ఒకటని BRS ఆరోపిస్తుండటం తెలిసిందే.
News October 7, 2025
నిబంధనలకు లోబడి దీపావళి టపాసులు అమ్మాలి: కలెక్టర్

భీమవరం కలెక్టరేట్లో దీపావళి టపాసుల తయారీ, అమ్మకాలకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై కలెక్టర్ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మంగళవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలంతా దీపావళి పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలన్నారు. టపాసులు విక్రయించేవారు ప్రభుత్వ నిబంధనలను లోబడి మాత్రమే అమ్మకాలు చేపట్టాలని హెచ్చరించారు. భద్రతా ప్రమాణాలను పక్కాగా పాటించాలని ఆదేశించారు.
News October 7, 2025
గూడూరు: వైన్ షాపులకు దరఖాస్తు స్వీకరణ: ఎక్సైజ్ CI

గూడూరు ఎక్సైజ్ పరిధిలోని 12 షాపులకు 2025-27 మద్యం పాలసీలో భాగంగా మంగళవారం ఒక దరఖాస్తు స్వీకరించినట్లు CI బిక్షపతి తెలిపారు. గూడూరు 2, గంగారం 2, కొత్తగూడ 2, కేసముద్రంలో 1 (ST), కేసముద్రం1, ఇనుగుర్తి 1 (SC), కేసముద్రం2, గుండెంగ 1 షాపులను (జనరల్)గా కేటాయించినట్లు CI పేర్కొన్నారు. వీటికి సంబంధించి మహబూబాబాద్ IDOCలో దరఖాస్తు స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు.