News March 17, 2025
అన్నమయ్య: ఒకవైపు తండ్రి మృతి.. మరో వైపు 10th పరీక్షలు

అన్నమయ్య జిల్లాలో హృదయాన్ని కలిచివేసే ఘటన చోసుకుంది. గ్రామస్థుల వివరాల మేరకు.. పీటీఎం మండలం గొడుగువారిపల్లెకు చెందిన వెంకటరమణ(55)కు ఇద్దరు పిల్లలు ఉండగా, భార్య వదిలేసింది. కూలి పనులు చేస్తూ పిల్లలను చదివించేవాడు. ఆదివారం చింతకాయలు కోయడానికి చెట్టుఎక్కి కింద పడి మృతి చెందాడు. దీంతో పిల్లలు అనాథలయ్యారు. కాగా నేడు వెంకటరమణ కుమార్తె పదో తరగతి పరీక్షలు రాయాల్సి ఉంది. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.
Similar News
News February 25, 2026
తెలుగు భాషను మరువొద్దు: మంత్రి లోకేశ్

సత్తెనపల్లి సుగాలి జెడ్పీ హైస్కూల్ విద్యార్థులతో వెలగపూడి అసెంబ్లీ లాబీలో మంత్రి లోకేశ్ ముచ్చటించారు. పిల్లలే రాష్ట్ర భవిత అని, చరిత సృష్టించేది మీరేనని ఆయన అన్నారు. కెరీర్ కోసం ఇంగ్లీష్ నేర్చుకుంటూనే మాతృభాష తెలుగును మరవొద్దని సూచించారు. విదేశాల్లో చదవడం వల్ల మొదట్లో తాను ఇబ్బంది పడ్డానని చెప్పారు. ఈ సందర్భంగా స్కూల్లో భోజనం, రాగిజావ, బోధన తదితర సౌకర్యాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
News February 25, 2026
విశాఖ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపులు

నగరంలో గల జిల్లా కోర్టులో ఆర్డీఎక్స్ బాంబు పెట్టినట్లు అజ్ఞాత వ్యక్తి ఈ మెయిల్ పంపాడు. సిబ్బంది వెంటనే స్పందించి నగర పోలీస్ కమిషనర్కు సమాచారం అందించారు. వెంటనే డాగ్ స్క్వాడ్ సిబ్బంది కోర్టుకు చేరుకున్నారు. సుమారు రెండు గంటల పాటు కోర్టు ఆవరణం మొత్తం జల్లెడ పట్టారు. ఎక్కడా ఎటువంటి బాంబు లేదని వారు నిర్ధారించారు.
News February 25, 2026
SKLM: ‘డయేరియా బాధితులకు మెరుగైన వైద్యం అందించండి’

డయేరియా బాధితులకు మరింత మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆసుపత్రి వైద్యులను ఆదేశించారు. జేమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న డయేరియా బాధితులను బుధవారం ఆయన పరామర్శించారు. వారికి అందిస్తున్న వైద్యం వివరాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని అన్నారు.


