News April 8, 2025
అన్నమయ్య, కడప జిల్లాలో న్యాయమూర్తుల బదిలీలు

అన్నమయ్య, కడప జిల్లాల్లో జడ్జిలను, అదనపు జిల్లా జడ్జిలను బదిలీ చేస్తూ రాష్ట్ర హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. వారు ఏప్రిల్ 21 తేదీ లోపు చార్జ్ తీసుకోవాలని వివరించారు. శ్రీలతను ఖాళీగా ఉన్న అన్నమయ్య జిల్లా మదనపల్లి 7 అదనపు జిల్లా జడ్జిగా బదిలీ చేశారు. చిత్తూరు పోక్సో కోర్టు జడ్జి ఎన్. శాంతిని కడప ఆరవ అదనపు జిల్లా జడ్జిగా బదిలీ చేశారు.
Similar News
News April 8, 2025
RCB కెప్టెన్కు జరిమానా

IPL: MIతో నిన్న జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా RCB కెప్టెన్ రజత్ పాటీదార్కు బీసీసీఐ జరిమానా విధించింది. మొదటిసారి కావడంతో రూ.12 లక్షల ఫైన్ వేసింది. కాగా కెప్టెన్గా తొలి సీజన్లోనే రజత్ రాణిస్తున్నారు. నాలుగు మ్యాచ్ల్లో మూడు విజయాలు సాధించారు. మరోవైపు బ్యాటింగ్లోనూ అదరగొడుతున్నారు. అతడు జట్టును కూల్గా ముందుండి నడిపిస్తున్నారని తాజాగా గవాస్కర్ ప్రశంసించారు.
News April 8, 2025
షారుఖ్ మూవీలో తల్లి పాత్రలో దీపికా!

బాలీవుడ్ స్టార్ నటుడు షారుఖ్ ఖాన్, సిద్ధార్థ్ ఆనంద్ కాంబోలో తెరకెక్కనున్న యాక్షన్ థ్రిల్లర్ ‘కింగ్’లో దీపికా పదుకొణె అతిథి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో ఆమె సుహానా ఖాన్ తల్లిగా, షారుఖ్ మాజీ ప్రేయసిగా కనిపించనున్నట్లు వార్తలొస్తున్నాయి. కథలో ప్రధాన సంఘర్షణలకు ఈ పాత్ర కేంద్రంగా ఉంటుందని తెలుస్తోంది. కాగా, ఇప్పటికే ఈ ముగ్గురి కాంబోలో వచ్చిన ‘పఠాన్’ రూ.1050 కోట్లు వసూలు చేసింది.
News April 8, 2025
MBNR: బుడియా బాపు ప్రత్యేకత (1/2)

బుడియా బాపును బంజారా ప్రజలు దైవంగా ఆరాధిస్తారు. ఆయనను సేవ్యసాత్ అని కూడా పిలుస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని గిరిజన తండాల్లో ఎక్కువగా పూజిస్తారు. బుడియా బాపు ఆలయం నల్గొండ జిల్లా రంగుండ్ల తండా గ్రామంలో ఉంది. బుడియా బాపును బంజారా ప్రజలు తమను తమ తండాలను అన్ని రకాల ఆపదల నుంచి రక్షించే దైవంగా నమ్ముతారు. ఆయనను ఆరాధించడం ద్వారా మంచి ఆరోగ్యం లభిస్తుందని,దీర్ఘకాలిక రోగాలు నయం అవుతాయని వారు విశ్వసిస్తారు.