News April 15, 2025

అన్నమయ్య: గుర్రపు స్వారీ క్రీడా ప్రాంగణం ప్రారంభం

image

మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా సోమవారం రాత్రి బసినికొండలో గుర్రపు స్వారీ క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. యువతకు క్రీడల్లో స్ఫూర్తిని నింపే విధంగా ఇప్పటికే సెటిల్,  క్రికెట్, వాలీబాల్ కోర్టులను ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగానే బసినికొండ వద్ద నూతనంగా గుర్రపు స్వారీ క్రీడా ప్రాంగణం ప్రారంభించామన్నారు. డాక్టర్ ఎన్.సేతు, షంషీర్, హరి పాల్గొన్నారు.

Similar News

News April 16, 2025

రామగిరి హెలిప్యాడ్ ఘటన.. వారు విచారణకు వస్తారా?

image

మాజీ సీఎం వైఎస్ జగన్ రామగిరి పర్యటన సందర్భంగా హెలికాప్టర్ విండో షీల్డ్‌కు ఎయిర్ క్రాక్ ఘటనప్తె పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ సంఘటనపై మరిన్ని వివరాలు తెలియజేయాలని పైలెట్, కోపైలెట్‌కు చెన్నేకొత్తపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. నేడు విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. హాజరైతే హెలిప్యాడ్ వద్ద జరిగిన పరిణామాలపై పోలీసులు నిగ్గు తేల్చనున్నారు.

News April 16, 2025

ECIL నుంచి భూపాలపల్లి జిల్లాకు డ్రోన్ల అందజేత

image

ECIL తన సొంత మేధా సంపత్తితో 12 డ్రోన్లు, 20 ఎలక్ట్రిక్ బైకులను భూపాలపల్లి జిల్లాకు సమకూర్చినట్లుగా తెలిపింది. భూపాలపల్లి జిల్లా పరిధిలోని గిరిజన ప్రాంతాల్లో తిరుగుతూ సేవలందించే సూపర్వైజర్లకు ఎలక్ట్రానిక్ బైక్లను అందిస్తారని పేర్కొంది. ఈ డ్రోన్ల ద్వారా వైద్య సేవలను సైతం మెరుగుపరచుకోవడం కోసం ఉపయోగించుకోవడానికి వీలుంటుందని ECIL తెలిపింది.

News April 16, 2025

కర్నూలు టీడీపీ కార్యాలయంపై దాడి.. నలుగురి అరెస్టు

image

కర్నూలులోని డీమార్ట్ వెనక ఉన్న టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో నలుగురిని నాల్గో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ బాబు ప్రసాద్ వివరాల ప్రకారం.. టీడీపీ కార్యాలయంపై ప్రభాకర్ నాయుడు, కాశీ, రహంతుల్లా, సలాంఖాన్ దాడికి పాల్పడ్డారు. వేటకొడవళ్లు, కత్తులతో కార్యాలయంలోని శేఖర్ గౌడ్‌పై దాడికి యత్నించారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

error: Content is protected !!