News March 21, 2026

అన్నమయ్య: ‘గ్యాస్’ సమస్యలా.. కాల్ చేయండి..!

image

అన్నమయ్య జిల్లాలోని 31 గ్యాస్ ఏజెన్సీలకు ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేసినట్లు జేసీ శివ నారాయణ శర్మ తెలిపారు. కలెక్టరేట్‌లో గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు, ఏజెన్సీలతో శనివారం సమావేశం నిర్వహించారు. జిల్లాలో గ్యాస్ సరఫరాపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. సమస్యలపై 08571-293001కు ఫిర్యాదు చేయవచ్చన్నారు.

Similar News

News March 30, 2026

మెదక్: బెట్టింగ్‌లకు పాల్పడినా, ప్రోత్సహించినా చర్యలు: ఎస్పీ హెచ్చరిక

image

జిల్లాలో ఎవరైనా క్రికెట్‌ లేదా ఇతర బెట్టింగ్‌లకు పాల్పడినా, ప్రోత్సహించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ డివి. శ్రీనివాస రావు హెచ్చరించారు. ఇటీవల కాలంలో సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో యువత క్రికెట్‌ బెట్టింగ్ మోజులో పడి తమ భవిష్యత్‌ను ప్రమాదంలోకి నెడుతున్నారని తెలిపారు. బెట్టింగ్‌లపై సమాచారం ఉన్నవారు వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100, కంట్రోల్ రూమ్ 8712657888కు సమాచారం ఇవ్వాలన్నారు.

News March 30, 2026

పెట్రోల్ బంకుల ద్వారా కిరోసిన్ పంపిణీ

image

యుద్ధం నేపథ్యంలో దేశంలో కిరోసిన్ వినియోగాన్ని అమలు చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. పెట్రోల్ బంకుల్లో తాత్కాలికంగా 60రోజుల పాటు దీన్ని పంపిణీ చేయాలని నిర్ణయించింది. ప్రతి జిల్లాలో 2బంకులు 5వేల లీటర్ల కిరోసిన్‌ను నిల్వ చేసుకునేలా నిబంధనలు సడలించింది. అలాగే ప్రజా పంపిణీ వ్యవస్థ(PDS) ద్వారా కిరోసిన్ సప్లై చేయనుంది. PNG కోసం శనివారం 6వేల మంది స్వచ్ఛందంగా LPG కనెక్షన్లు వదులుకున్నట్లు కేంద్రం తెలిపింది.

News March 30, 2026

గోదావరిలో దూకి B.tech చదివిన యువకుడి ఆత్మహత్య

image

గోదావరిలోకి దూకి యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాజమండ్రిలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా.. రావులపాలానికి చెందిన జాగ్రత్ యువరాజు( 24) బీటెక్ చదివాడు. ఇటీవల అతడు ఖాళీగా ఉంటున్నాడని తండ్రి నూకరాజు మందలించడంతో ఈనెల 27న ఇంటి నుంచి అలిగి వెళ్లిపోయాడు. కాగా, ఆదివారం అతడు స్థానిక గోదావరి గట్టు ధోబి ఘాట్ వద్ద శివమై తేలాడు. టూ టౌన్ ఎస్ఐ అశ్వక్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.