News February 13, 2025

అన్నమయ్య జిల్లాలో ఉదయాన్నే రోడ్డు ప్రమాదం

image

కె.వి పల్లి మండలం, తీతా గుంటపల్లి పంచాయతీ ఈతమాను వడ్డిపల్లి వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నై నుంచి రాయచోటికి వస్తున్న కారు పొగమంచు కారణంగా మోరీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. వెంటనే 108 సహాయంతో పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 29, 2025

2029లోనూ మోదీ ప్రభుత్వమే: అమిత్ షా

image

ప్రజాసేవ, అభివృద్ధి మంత్రాన్ని ప్రతిపక్షాలు అర్థం చేసుకోలేవని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. అందుకే ప్రతిసారి ఓడిపోతున్నాయని చెప్పారు. ‘2029లోనూ మోదీ నాయకత్వంలో మా ప్రభుత్వం ఏర్పడుతుంది. BJP సూత్రాలతో ప్రజలు కనెక్ట్ కావడమే ఇందుకు కారణం. అయోధ్య, సర్జికల్ స్ట్రైక్స్, ఆర్టికల్ 370 రద్దు.. అన్నింటినీ ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. జనం మద్దతిచ్చే వాటిని వ్యతిరేకిస్తే ఓట్లు ఎలా పడతాయి’ అని ప్రశ్నించారు.

News December 29, 2025

నేడు ప్రజా సమస్య పరిష్కార వేదిక: కలెక్టర్

image

పుట్టపర్తితో పాటు మండల, డివిజన్, మున్సిపల్ కార్యాలయాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ శ్యాంప్రసాద్ ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తామన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తులను కలెక్టరేట్‌కు వచ్చే అవసరం లేకుండా meekosam.ap.gov.inలో ఆన్‌లైన్ ద్వారా కూడా సమర్పించవచ్చని సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News December 29, 2025

పెన్షన్ పంపిణీ తేదీ మార్పు

image

జనవరి 1న ఇవ్వాల్సిన పెన్షన్లను డిసెంబర్ 31న ఇంటివద్దకే వెళ్లి పంపిణీ చేయాలని అధికారులను కలెక్టర్ డా.ఏ.సిరి ఆదేశించారు. పంపిణీలో ఎలాంటి ఫిర్యాదులు రాకుండా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. పెన్షన్ పంపిణీ సజావుగా జరిగేలా కంట్రోల్ రూమ్‌ల ద్వారా పర్యవేక్షించాలని సూచించారు. పెన్షన్ పంపిణీలో ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.