News September 23, 2025

అన్నమయ్య జిల్లాలో PAI 2.0 వర్క్‌షాప్ నిర్వహణ

image

అన్నమయ్య జిల్లా JC కలెక్టర్ అధ్యక్షతన PGRS హాల్‌లో పంచాయతీ పురోగతి సూచిక 2.0 పై మంగళవారం ఒకరోజు వర్క్‌షాప్ విజయవంతంగా నిర్వహించబడింది. జిల్లా, డివిజనల్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. వర్క్‌షాప్‌లో 2030 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన కోసం గ్రామ పంచాయతీల పనితీరు పర్యవేక్షణ, డేటా ఆధారిత పాలన, వివిధ వనరులు మరియు భాగస్వామ్యాలను సమన్వయం చేయడం వంటి అంశాలపై శిక్షణ ఇవ్వబడిందని అధికారులు తెలిపారు.

Similar News

News September 23, 2025

10 గ్రా. బంగారం ధర రూ.2లక్షలు?.. ‘జెఫరీస్’ అంచనా

image

ప్రపంచ ఆర్థిక అనిశ్చితులతో ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నారని, దీంతో ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని ప్రఖ్యాత స్టాక్ బ్రోకరేజ్ సంస్థ ‘జెఫరీస్’ గ్లోబల్ హెడ్ క్రిస్ వుడ్ అంచనా వేశారు. ప్రస్తుతం ఉన్న ధరల నుంచి ఏకంగా 77% మేర పెరగొచ్చని అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఇదే నిజమైతే 10గ్రా బంగారం ధర ₹2 లక్షల మార్కును చేరుకోనుంది. అయితే ఎప్పటివరకు గోల్డ్ ఆ మార్క్ అందుకుంటుందో చెప్పలేదు.

News September 23, 2025

పత్తి కొనుగోలు పారదర్శకంగా జరగాలి: కలెక్టర్

image

పత్తి కొనుగోళ్లు పూర్తి పారదర్శకంగా జరగాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం పాల్వంచ కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని, ప్రభుత్వం నిర్ణయించిన ధర రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

News September 23, 2025

బాపట్ల అధికారులకు కలెక్టర్ సూచనలు

image

బాపట్ల కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లాలోని మున్సిపల్ పంచాయతీరాజ్ అధికారులతో కలెక్టర్ వినోద్ కుమార్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులకు సూచించారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.