News April 7, 2025

అన్నమయ్య జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి జనార్దన రెడ్డి పర్యటన రద్దు

image

అన్నమయ్య జిల్లాలో ఈ నెల 8, 9 తేదీలలో అన్నమయ్య జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన రెడ్డి పర్యటన రద్దయిందని సమాచార శాఖ అధికారులు తెలిపారు. అనివార్య కారణాల వల్ల పర్యటన రద్దయిందని రోడ్లు, భవనాలు, పెట్టుబడులు,మౌళిక సదుపాయాలు & మౌలిక సదుపాయాల మంత్రిత్వ శాఖ అమరావతి అధికారులు ప్రకటన జారీ చేశారు.

Similar News

News September 18, 2025

జిల్లాలో 3,293 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ: కలెక్టర్

image

జిల్లాలో సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. చిత్తూరు, పూతలపట్టు, జీడీ నెల్లూరు, కుప్పం, పలమనేరు, పుంగనూరు, నగరి నియోజకవర్గ పరిధిలోని 125 క్లస్టర్లలో 3,293 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉందన్నారు. ఆర్ఎస్కేలు, ప్రైవేటు దుకాణాలు, సొసైటీలలో యూరియా పంపిణీ పకడ్బందీగా చేపట్టాలని ఆదేశాలు జారీ చేశామన్నారు.

News September 18, 2025

వార్డు అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వర్తించండి: బల్దియా కమిషనర్

image

ఇటీవల వార్డు అధికారులుగా బాధ్యతలు చేపట్టిన అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వహించాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. గురువారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో పన్ను వసూళ్లపై ఆర్ఐలు వార్డు అధికారులు బిల్ కలెక్టర్లతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో కమిషనర్ పాల్గొని సమర్థవంతంగా నిర్వహించుటకు సూచనలు చేశారు.

News September 18, 2025

తప్పిన మరో పెను విమాన ప్రమాదం

image

విశాఖ నుంచి HYD ప్రయాణించాల్సిన ఎయిరిండియా విమానానికి పెనుప్రమాదం తప్పింది. విశాఖలో టేకాఫ్ అయిన కాసేపటికే ఫ్లైట్ ఇంజిన్‌ ఫ్యాన్ రెక్కల్లో పక్షి చిక్కుకుంది. దీంతో ఫ్యాన్ రెక్కలు దెబ్బతిన్నాయి. అప్రమత్తమైన పైలట్ విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో సేఫ్ ల్యాండింగ్ చేశారు. ఆ టైంలో విమానంలో 103మంది ప్రయాణికులున్నారు. కొన్నినెలల కింద అహ్మదాబాద్‌ ఫ్లైట్ క్రాష్‌లో 270మందికి పైగా మరణించిన విషయం తెలిసిందే.