News March 28, 2025
అన్నమయ్య జిల్లా ఎస్పీ కీలక సూచనలు

మీరు చేసే చిన్న క్లిక్తో భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుందని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు యువతకు సూచనలు ఇస్తున్నారు. కస్టమర్ కేర్, వాట్సాప్ చిట్కాలు, ఈజీ మనీ కోసం కనిపించిన లింకులను క్లిక్ చేయొద్దన్నారు. ముఖ్యంగా ఏపీకే ఫైల్స్తో జాగ్రత్తగా ఉండండి అని సూచించారు. ప్రభుత్వ పథకాలు, వర్క్ ఫ్రమ్ హోం వంటి, ప్రకటనలకు ఆకర్షితులై లింక్ క్లిక్ చేయొద్దు అని హెచ్చరించారు.
Similar News
News December 28, 2025
శ్రీకాకుళం జిల్లాలో పంచాయతీలు పెరగనున్నాయా?

శ్రీకాకుళం జిల్లాలో 30 మండలాల్లో ప్రస్తుతం 912 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో జనాభా ప్రాతిపదికన, పాలనా సౌలభ్యంకోసం ప్రజలనుంచి వినతలు వచ్చాయి. ఈ మేరకు 52 కొత్త పంచాయితీల ఏర్పాటుకు ప్రతిపాదన సిద్ధం చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి భారతి, సౌజన్య చెప్పారు. జిల్లా కలెక్టర్ అనుమతుల తర్వాత పంచాయతీ విభజన సాధ్యమవుతుందన్నారు.
News December 28, 2025
‘అఖండ గోదావరి’.. ‘తూర్పు’ వెలుగులకి రాదారి!

2025లో తూర్పుగోదావరి జిల్లా మౌలిక, పర్యాటక రంగాల్లో నూతన జవజీవాలను సంతరించుకుంది. రాజమండ్రిని ప్రపంచ పర్యాటక చిత్రపటంపై నిలిపే ‘అఖండ గోదావరి’ ప్రాజెక్టుకు రూ.94.44 కోట్లతో అంకురార్పణ జరగడం ఈ ఏడాది అతిపెద్ద ముందడుగు. రూ.350 కోట్లతో ఆధునికీకరించిన రాజమండ్రి విమానాశ్రయం కొత్త టెర్మినల్ అందుబాటులోకి రావడం, గోదావరి వాటర్ గ్రిడ్ పనులకు శ్రీకారం చుట్టడం జిల్లా పారిశ్రామిక ప్రగతికి బలమైన పునాది వేశాయి.
News December 28, 2025
HYD: కాళ్ల పారాణి ఆరకముందే.. కాటికి (Rewind)

కాళ్ల పారాణి ఆరకముందే ఆడబిడ్డల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. కట్టుకున్నవాడు కంటికి రెప్పలా చూసుకుంటాడని నమ్మితే.. అదనపు కట్నం కోసం వేధించి కాటికి పంపుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. గ్రేటర్ HYDలో పరిధిలో గత 11 నెలల్లోనే దాదాపు 16 మంది మహిళలు వరకట్న వేధింపులకు బలైనట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. కట్న దాహంతో అత్తారింటి వేధింపులు మితిమీరడంతో వధువుల జీవితాలు అర్ధాంతరంగా ముగుస్తున్నాయి.


