News December 30, 2024

అన్నమయ్య జిల్లా: ప్రమాదంలో భర్త మృతి.. భార్య పరిస్థితి విషమం

image

మదనపల్లె బైపాస్‌లోని రాయల్ ఉడ్ వద్ద ఆదివారం రాత్రి ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కారు టైర్ పంచర్ కావడంతో బైకు, బంకు, చెట్టును ఢీకొట్టింది. గాయాలపాలైన దంపతుల్ని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ భర్త మృతి చెందాడు. భార్య కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. మృతుడు పలమనేరు దాసర్లపల్లికి చెందిన గంగాధర్‌గా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Similar News

News January 7, 2026

కడపలో శ్రీరామ శోభాయాత్ర, కళ్యాణ ఏర్పాట్లపై సమీక్ష

image

ఈనెల 21, 22 తేదీల్లో కడప మున్సిపల్ గ్రౌండ్స్‌లో జరగనున్న శ్రీరామ మహా శోభాయాత్ర, శ్రీ సీతారాముల కళ్యాణం విజయవంతం కావాలని మంగళవారం కలెక్టర్ శ్రీధర్ అధికారులతో సమీక్ష చేశారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, MLA మాధవి కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా, ఏర్పాట్లు సజావుగా, ఘనంగా ఉండేలా చూడాలని ఆదేశించారు.

News January 7, 2026

కడపలో శ్రీరామ శోభాయాత్ర, కళ్యాణ ఏర్పాట్లపై సమీక్ష

image

ఈనెల 21, 22 తేదీల్లో కడప మున్సిపల్ గ్రౌండ్స్‌లో జరగనున్న శ్రీరామ మహా శోభాయాత్ర, శ్రీ సీతారాముల కళ్యాణం విజయవంతం కావాలని మంగళవారం కలెక్టర్ శ్రీధర్ అధికారులతో సమీక్ష చేశారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, MLA మాధవి కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా, ఏర్పాట్లు సజావుగా, ఘనంగా ఉండేలా చూడాలని ఆదేశించారు.

News January 6, 2026

కడప జిల్లాలో ఉల్లి రైతులకు రూ.28.40 కోట్ల సాయం.!

image

కడప జిల్లాలో 7298 మంది ఉల్లి రైతులకు 14,203.31 ఎకరాలకు రూ.28.40 కోట్లు ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం విడుదల చేసింది.
*కమలాపురం 2526 మందికి రూ.11.32 కోట్లు
*మైదుకూరు 2352 మందికి రూ.7.74 కోట్లు
*పులివెందుల 1590 మందికి రూ.6.17 కోట్లు
*జమ్మలమడుగు 742 మందికి రూ.2.99 కోట్లు
*బద్వేల్ 67మందికి రూ.14.92 లక్షలు
*రాజంపేట 18మందికి రూ.2.33 లక్షలు
*కడప ఇద్దరికి రూ.35,900
*ప్రొద్దుటూరులో ఒకరికి రూ.20.60 వేలు.