News January 26, 2025
అన్నమయ్య జిల్లా రయితకు రాజభవన్ పిలుపు

రిపబ్లిక్ డే సందర్భంగా విజయవాడలోని ‘రాజభవన్’లో ఎట్ హోమ్ జరగనుంది. ఈ కార్యక్రమానికి అన్నమయ్య జిల్లా నుంచి ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రముఖ రచయిత, రాష్ట్ర అధికార భాషా సంఘ మాజీ సభ్యులు అబ్దుల్ ఖాదర్కు ఆహ్వానం అందిదంది. కలికిరి తహసీల్దార్ మహేశ్వరీబాయి ఆయనకు ఆహ్వానపత్రాన్ని అందించారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించినందుకు అబ్దుల్ ఖాదర్కు ఈ గౌరవం దక్కింది.
Similar News
News February 11, 2026
NZB: పోటీలో మొత్తం 714 మంది అభ్యర్థులు: కలెక్టర్

నిజామాబాద్ జిల్లాలోని కార్పొరేషన్, మూడు మున్సిపాలిటీలలో మొత్తం 714 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి వివరించారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అత్యధికంగా నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో 350 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారన్నారు. బోధన్లో 162 మంది, ఆర్మూర్లో 153 మంది, భీంగల్లో 49 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని వెల్లడించారు.
News February 11, 2026
అమరావతికి చట్టబద్ధత కల్పించాలని అమిత్షాను కోరిన CM

ఢిల్లీ పర్యటనలో భాగంగా CM చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్షా సహా ఏడుగురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. వివిధ ప్రాజెక్టులపై విజ్ఞాపన పత్రాలు అందజేశారు. రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని అమిత్షాకు విజ్ఞప్తి చేశారు. APలో మఖానా డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని శివరాజ్ సింగ్ చౌహాన్ను కోరారు. పోలవరం రెండో దశకు రూ.32 వేలకోట్లు అవసరమని జలశక్తి శాఖ మంత్రి CR పాటిల్కు విజ్ఞప్తి చేశారు.
News February 11, 2026
HYD: లైసెన్స్ లేకుండా బండి నడుపుతున్నారా?

మార్చి 1, 2026 నుంచి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఇక మీదట నుంచి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిరంతర ప్రత్యేక డ్రైవ్లను నిర్వహించనున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తులు RTA నుంచి తీసుకోవాలని సూచించారు. లైసెన్స్ లేని డ్రైవర్లతోనే ప్రమాదాలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. బైక్ ఓనర్ లైసెన్స్ లేని వారికి వాహనం ఇచ్చినా నేరమేనని పోలీసులు హెచ్చరించారు.


