News January 26, 2025

అన్నమయ్య జిల్లా రయితకు రాజభవన్ పిలుపు

image

రిపబ్లిక్ డే సందర్భంగా విజయవాడలోని ‘రాజభవన్’లో ఎట్ హోమ్ జరగనుంది. ఈ కార్యక్రమానికి అన్నమయ్య జిల్లా నుంచి ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రముఖ రచయిత, రాష్ట్ర అధికార భాషా సంఘ మాజీ సభ్యులు అబ్దుల్ ఖాదర్‌కు ఆహ్వానం అందిదంది. కలికిరి తహసీల్దార్ మహేశ్వరీబాయి ఆయనకు ఆహ్వానపత్రాన్ని అందించారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించినందుకు అబ్దుల్ ఖాదర్‌కు ఈ గౌరవం దక్కింది.

Similar News

News October 22, 2025

ప్రభుత్వ బడుల్లో నేటి నుంచి ఆధార్ నవీకరణ శిబిరాలు

image

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఆధార్ వివరాల మార్పు, నవీకరణ కోసం నేటి నేటి నుంచి 31వ తేదీ వరకు ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 1,55,780 మంది విద్యార్థులు ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ చేయించుకోవాల్సి ఉంది. ఇందులో ఎన్టీఆర్ జిల్లాలో 95,251 మంది, కృష్ణా జిల్లాలో 60,529 మంది ఉన్నారు. పిల్లల వివరాలు సరిచేయడం తప్పనిసరి అని అధికారులు తెలిపారు.

News October 22, 2025

మంచిర్యాల: ఫ్లైఓవర్‌ పైనుంచి తోసి చంపేశాడు

image

మంచిర్యాల జిల్లాలో సోమవారం భార్యను భర్త హత్య చేసిన ఘటనలో CI ఆశోక్ వివరాలు వెల్లడించారు. మందమర్రి వాసి ఆశోక్ పెద్దపల్లి జిల్లా కనుకుల వాసి రజిత(30)తో 2013లో వివాహమైంది. పెళ్లైన సంవత్సరం నుంచే అనుమానంతో ఆమెను వేధించేవాడు. అత్తారింటికి వెళ్లిన ఆశోక్ ఈనెల 19న బంధువుల ఇంటికి వెళ్దామని బైక్‌పై రజితను తీసుకెళ్లాడు. CCC సమీపంలోని 363 <<18055726>>ఫ్లైఓవర్‌ <<>>పైనుంచి తోసేశాడు. 20న నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.

News October 22, 2025

పల్నాడు శైవ క్షేత్రాలలో కార్తీక మాసం సందడి

image

పల్నాడులో ప్రముఖ శైవ క్షేత్రాలైన గుత్తికొండ, దైద, సత్రశాలలో కార్తీక మాసం సందడి నెలకొంది. కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా బుధవారం తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. దైద, సత్రశాల ఆలయాలు కృష్ణా నది పక్కనే ఉండడంతో నదిలో మహిళలు ప్రత్యేక పుణ్య స్నానాలు చేశారు. అనంతరం గుత్తికొండ ఓంకారేశ్వరుడు, దైద అమరలింగేశ్వర స్వామి, సత్రశాల మల్లికార్జునస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.