News February 24, 2025
అన్నమయ్య జిల్లా TODAY TOP NEWS

➢ ఏసీబీకి చిక్కిన అన్నమయ్య జిల్లా అధికారి
➢ కలికిరి: రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
➢ మదనపల్లె: మారణాయుధాలతో దాడి.. 10 మంది అరెస్ట్
➢ జగన్ రెడ్డి.. నీ నాటకాలు కట్టిపెట్టు: చమర్తి
➢ మదనపల్లె: పాలిటెక్నిక్ కాలేజీలో రేపు జాబ్ మేళా
➢ పీలేరు: వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా లోకనాథం
➢ నా రాజకీయ ప్రయాణం లోకేశ్ సారథ్యంలోనే: మేడా
➢ మదనపల్లె: మహిళపై పశువుల కాపర్లు దాడి
Similar News
News July 4, 2025
గద్వాల: ‘ఆపరేషన్ ముస్కాన్-11 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి’

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్-11 కార్యక్రమాన్ని సంబంధిత శాఖ అధికారులు విజయవంతం చేయాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం గద్వాలలోని పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తప్పిపోయిన పిల్లలను గుర్తించి, వారిని రక్షించి, పునరావాసం కల్పించి సమస్యను పరిష్కరించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు.
News July 4, 2025
RJPT: భూ భారతి దరఖాస్తులను పరిశీలించిన కలెక్టర్

రాజంపేట మండలం తలమడ్లలో శుక్రవారం కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ భూ భారతి దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో పర్యటించారు. దేవాయిపల్లిలో జరుగుతున్న దరఖాస్తుల పరిశీలించారు. సమీక్షించిన కలెక్టర్, భూ భారతి చట్టానికి అనుగుణంగా ప్రతి దరఖాస్తును నిష్పక్షపాతంగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని తహశీల్దార్ జానకికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వీణ, డిప్యూటీ తహశీల్దార్ సంతోషి, సిబ్బంది పాల్గొన్నారు.
News July 4, 2025
రామన్నపేట: స్కూల్కు వెళ్లడానికి ట్రాక్టర్లే గతి!

రామన్నపేట(M) కుంకుడుపాముల విద్యార్థులు పాఠశాలకు వెళ్లడానికి అగచాట్లు పడుతున్నారు. బస్సు సౌకర్యం లేక ట్రాక్టర్పై అమ్మనబోలులోని స్కూల్కు వెళ్తున్నారు. ప్రమాదమని తెలిసీ తప్పక ప్రయాణించి గమ్యం చేరుకుంటున్నారు. ఒక బస్సు NLG-NKP-అమ్మనబోలు వచ్చి వేరే రూట్లో వెళ్తుంది. దాన్ని అమ్మనబోలు-కుంకుడుపాముల మీదుగా రామన్నపేటకు అధికారులు తీసుకొస్తే పిల్లల సమస్య తీరుతుందని గ్రామానికి చెందిన మిర్యాల రమేశ్ తెలిపాడు.