News April 8, 2025
అన్నమయ్య : డిప్యూటీ కలెక్టర్ మృతి.. ప్రమాదం జరిగింది ఇలా..!

పీలేరు హంద్రీనీవా సుజల స్రవంతి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా పని చేస్తున్న రమ (56) మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె సోమవారం ఉదయం రాయచోటిలో జరిగే ప్రజాసమస్యల పరిష్కార వేదికకు కారులో వెళ్తుండగా సంబేపల్లిలోని ఎర్రగుంట్ల బస్టాండ్ సమీపంలో, గల్ఫ్కు వెళ్లేందుకు చెన్నై వెళ్తున్న కారు ఢీ కొట్టింది. రమ అక్కడికక్కడే చనిపోగా.. ఆమె డ్రైవర్ ముబారక్, అటెండర్ జీరూనాయక్, ఢీ కొట్టిన కారు డ్రైవర్ గాయపడ్డారు.
Similar News
News December 25, 2025
గోపాలపురం: రాష్ట్ర స్థాయి క్రికెట్ జట్టుకు యశశ్రీ ఎంపిక

గోపాలపురం(M) పెద్దాపురం గ్రామానికి చెందిన తానింకి యశశ్రీ రాష్ట్ర స్థాయి క్రికెట్ జట్టుకు ఎంపికైంది. గన్నవరంలో జరిగిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-17 బాలికల పోటీల్లో ఆమె ప్రతిభ కనబరిచింది. యశశ్రీ విజయం పట్ల పెద్దాపురం గ్రామస్థులు గురువారం హర్షం వ్యక్తం చేశారు. కుమార్తెకు చిన్ననాటి నుంచి క్రికెట్ పై ఉన్న ఆసక్తిని గుర్తించి ప్రోత్సహించామని తండ్రి సత్తిబాబు ఈ సందర్భంగా ఆనందాన్ని పంచుకున్నారు.
News December 25, 2025
కరుణ, ప్రేమే క్రిస్మస్ సందేశం: ఎస్పీ

క్రీస్తు జన్మదినమైన క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని జిల్లా ప్రజలందరికీ క్రైస్తవ సోదరీసోదరులకు వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమె మాట్లాడుతూ.. శాంతి, కరుణ, ప్రేమ, సహనానికి ప్రతీకగా నిలిచే ఏసుప్రభువు బోధనలు సమాజంలో సోదరభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. అత్యంత ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని ఆమె కోరారు.
News December 25, 2025
వాట్సాప్ ‘బ్లాక్’ మిస్టరీ: ఆ నంబర్ల డేటా కోరిన ప్రభుత్వం!

ఈ ఏడాది ప్రతినెలా సగటున కోటి ఇండియన్ అకౌంట్స్ను వాట్సాప్ బ్లాక్ చేసింది. ఆన్లైన్ ఫ్రాడ్స్, స్కామ్స్ పెరగడమే దీనికి కారణం. అయితే ఏ నంబర్లను బ్యాన్ చేశారో ప్రభుత్వంతో షేర్ చేయడం లేదు. డిజిటల్ అరెస్ట్ వంటి స్కామ్స్ వాట్సాప్ ద్వారానే జరుగుతున్నాయి. సిమ్ కార్డు లేకపోయినా ఇవి పనిచేస్తాయి. కాబట్టి నిందితులను పట్టుకోవడం సవాలుగా మారింది. అందుకే బ్యాన్ చేసిన నంబర్ల వివరాలను ప్రభుత్వం కోరుతోంది.


