News March 19, 2025
అన్నమయ్య: పుట్టిన రోజే మృతి

పుట్టిన రోజు సరదాగా స్నేహితుడితో వెళ్లిన వారికి అదే చివరి రోజు అయింది. ఈ విషాద ఘటన అన్నమయ్య జిల్లా పీటీఎం మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అంబేడ్కర్ కాలనీకి చెందిన శ్రీనివాసులు(22)ది సోమవారం పుట్టినరోజు. తన స్నేహితుడు చందు(22)తో బి.కొత్తకోటలో సినిమా చూడటానికి వెళ్లారు. ఇంటికి వస్తున్న క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.
Similar News
News November 2, 2025
జూబ్లీహిల్స్లో కాంగ్రెస్కు విజయావకాశాలు: Lok Poll సర్వే

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీకే విజయావకాశాలు ఉన్నాయని Lok Poll సర్వే తెలిపింది. 3,100 మందిపై సర్వే చేయగా 44% మంది కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నారని పేర్కొంది. బీఆర్ఎస్కు 38శాతం, బీజేపీ 15శాతం, ఇతరులు 3శాతం ప్రభావం చూపుతారని వెల్లడించింది. నిన్న విడుదలైన <<18171588>>కేకే సర్వేలో<<>> బీఆర్ఎస్కు గెలుపు అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఉపఎన్నిక ఈ నెల 11న జరగనుంది.
News November 2, 2025
NLG: నజరానా ఇస్తాం.. షాపు ఇస్తారా?!

నల్గొండ జిల్లాలో నూతన మద్యం దుకాణాల కేటాయింపు పూర్తి కావడంతో కొత్తగా మద్యం షాపులు దక్కించుకున్న వారికి వ్యాపారులు బంపర్ ఆఫర్ చేస్తున్నారు. నజరానా ఇస్తాం.. షాపు ఇస్తారా.. అంటూ ప్రలోభపెడుతున్నారు. ఈసారి టెండర్లలో పాత మద్యం వ్యాపారులకు దురదృష్టం, కొత్త వారికి అదృష్టం కలిసి వచ్చింది. జిల్లాలో 154 మద్యం దుకాణాలకు 4906 దరఖాస్తులు వచ్చిన విషయం విధితమే.
News November 2, 2025
NZB: 77 కిలోల వెండి చోరీ

నిజామాబాద్లోని వన్ టౌన్ పరిధిలో ఓ సిల్వర్ మర్చంట్ షాపులో 77 KGల వెండి చోరీ అయ్యింది. నగరానికి చెందిన ఇద్దరు సిల్వర్ మర్చంట్లో 6 నెలలుగా పని చేస్తున్నారు. వారు షాప్లో నుంచి వెండిని విడతల వారీగా చోరీ చేశారు. ఇటీవల వారిని షాప్ యజమాని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దీంతో 4 KGల వెండిని తిరిగి ఇచ్చినట్లు సమాచారం. మిగతా 73 KGల వెండి తిరిగి ఇవ్వకపోవడంతో బాధితుడు వన్ టౌన్లో ఫిర్యాదు చేశాడు.


