News September 12, 2025

అన్నమయ్య: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. ఇద్దరి మృతి

image

అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం మంగంపేట వద్దగల చెన్నకేశవస్వామి గుడి వద్ద శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళంపల్లికి చెందిన అంకమ్మ(70), రామచంద్రయ్య(50) మరో వ్యక్తి రోడ్డు దాటుతుండగా బెంగళూరు వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా ఇంకొకరు తీవ్రంగా గాయపడ్డారు.

Similar News

News September 13, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News September 13, 2025

సెప్టెంబర్ 13: చరిత్రలో ఈ రోజు

image

1913: సినీ నటుడు సీహెచ్ నారాయణరావు జననం
1929: స్వతంత్ర సమరయోధుడు జతీంద్ర నాథ్ దాస్ మరణం
1948: హైదరాబాద్‌లోకి భారత సైన్యం ప్రవేశం
1960: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి జననం
1960: సినీ నటుడు కార్తీక్ జననం
1965: నటి ముచ్చర్ల అరుణ జననం
1969: ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ జననం
1989: సినీ రచయిత ఆచార్య ఆత్రేయ మరణం (ఫొటోలో)

News September 13, 2025

దక్షిణ భారత కుంభమేళాకు ఏర్పాట్లు చేయాలి: CM

image

TG: 2027 జులై 23 నుంచి మొదలయ్యే గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభమేళాగా ఘనంగా నిర్వహించాలని CM రేవంత్ అధికారులను ఆదేశించారు. ఏర్పాట్లపై మంత్రులు, అధికారులతో సమీక్షించారు. గోదావరి వెంట ఉన్న ప్రధాన ఆలయాలను అభివృద్ధి చేయాలన్నారు. దాదాపు 22 నెలల వ్యవధి ఉన్నందున శాశ్వత మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై దృష్టి సారించాలన్నారు. 74 చోట్ల ఘాట్లను నిర్మించాలని ఆదేశించారు.