News March 29, 2025
అన్నమయ్య: బాలుడిపై ఆఘాయిత్యం

అన్నమయ్య జిల్లాలో అమానుష ఘటన వెలుగు చూసింది. సంబేపల్లి ఎస్ఐ భక్తవత్సలం వివరాల మేరకు.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన 9ఏళ్ల బాలుడు ఈనెల 27 సాయంత్రం ఇంటి వద్ద సైకిల్ తొక్కుతున్నాడు. ఈక్రమంలో అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ బాలుడికి మాయమాటలు చెప్పాడు. బలవంతంగా తన ఆటోలో తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బయటకు చెబితే చంపేస్తానని బెదిరించడంతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.
Similar News
News September 15, 2025
జూబ్లీహిల్స్ నుంచే కేసీఆర్ జైత్రయాత్ర: కేటీఆర్

జూబ్లీహిల్స్ నుంచే కేసీఆర్ జైత్రయాత్ర మొదలవ్వాలని KTR పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రేవంత్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో 13 లక్షల పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ను ఆగం చేసినందుకు కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ప్రజలు బుద్ధి చెప్పాలని ఆయన కోరారు.
News September 15, 2025
రేపు ఆర్ట్స్ కళాశాలలో సైబర్ క్రైమ్ నేరాలపై అవగాహన సదస్సు

హనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో సైబర్ క్రైమ్ నేరాలపై అవగాహన సదస్సును మంగళవారం నిర్వహిస్తున్నట్లు ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొ.సుంకరి జ్యోతి తెలిపారు. ఈ కార్యక్రమానికి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమం ఉ.11 గం.కు ఆడిటోరియంలో నిర్వహించబడుతుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
News September 15, 2025
డిజిటల్ ల్యాబ్లను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు డిజిటల్ కంప్యూటర్ ల్యాబ్లను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ కోరారు. సోమవారం కోదాడలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డితో కలిసి ఆయన నూతన కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించారు. విద్యార్థులు కంప్యూటర్ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.