News March 21, 2025
అన్నమయ్య: మహిళను రేప్ చేసిన వ్యక్తిపై కేసు.!

మహిళను నమ్మించి నయవంచనకు గురి చేయడమే కాకుండా, అత్యాచారానికి పాల్పడి ఆపై అబార్షన్ చేయించిన వ్యక్తిపై మదనపల్లె వన్టౌన్ పోలీసులు గురువారం రాత్రి కేసు నమోదు చేశారు. సీఐ ఎరిసావలి తెలిపిన వివరాల మేరకు.. మదనపల్లె బెంగళూరు రోడ్డులోని ఓ ఆసుపత్రిలో మేనేజర్గా పనిచేస్తున్న రాజేశ్ అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్స్పై అత్యాచారం చేశాడు. ఈ మేరకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Similar News
News March 1, 2026
ఆర్ట్స్ కళాశాలలో ముగిసిన ఎస్సీ స్టడీ సర్కిల్ పరీక్ష

ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగ యువతకు వివిధ పోటీ పరీక్షల్లో ఉచిత శిక్షణ అందించేందుకు నిర్వహించిన ఎస్సీ స్టడీ సర్కిల్ ప్రవేశ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. గ్రూప్-1, 2, 3, 4 తో పాటు RRB, బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం ఈ పరీక్షను ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేశారు. ప్రిన్సిపల్ ప్రొ.జ్యోతి, ఎస్సీ అభివృద్ధి శాఖ డిప్యూటీ డైరెక్టర్ బి.నిర్మల పరీక్షా కేంద్రాలను సందర్శించి పర్యవేక్షించారు.
News March 1, 2026
Zero Discrimination Day.. Way2News Message..!

నేడు ప్రపంచ వివక్ష వ్యతిరేక దినోత్సవం. మనిషిని మనిషిగా గౌరవించడమే అసలైన నాగరికత. రంగు, రూపం, కులం, మతం.. ఇలా ఏ కారణంతోనైనా ఎవరినీ తక్కువ చేసి చూడటం నేరం. ముఖ్యంగా ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలు దక్కాలి. మన ఆలోచనల్లో మార్పు వస్తేనే సమాజం బాగుపడుతుంది. ఎదుటివారిని చిన్నచూపు చూడటం మానేసి ప్రేమాభిమానాలతో బతుకుదాం. 2026 థీమ్ ప్రకారం ‘మనుషులకే మొదటి ప్రాధాన్యం’ ఇద్దాం. ఇందుకు మనమే తొలి అడుగు వేద్దాం.
News March 1, 2026
Zero Discrimination Day.. Way2News Message..!

నేడు ప్రపంచ వివక్ష వ్యతిరేక దినోత్సవం. మనిషిని మనిషిగా గౌరవించడమే అసలైన నాగరికత. రంగు, రూపం, కులం, మతం.. ఇలా ఏ కారణంతోనైనా ఎవరినీ తక్కువ చేసి చూడటం నేరం. ముఖ్యంగా ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలు దక్కాలి. మన ఆలోచనల్లో మార్పు వస్తేనే సమాజం బాగుపడుతుంది. ఎదుటివారిని చిన్నచూపు చూడటం మానేసి ప్రేమాభిమానాలతో బతుకుదాం. 2026 థీమ్ ప్రకారం ‘మనుషులకే మొదటి ప్రాధాన్యం’ ఇద్దాం. ఇందుకు మనమే తొలి అడుగు వేద్దాం.


