News March 21, 2025
అన్నమయ్య: మహిళను రేప్ చేసిన వ్యక్తిపై కేసు.!

మహిళను నమ్మించి నయవంచనకు గురి చేయడమే కాకుండా, అత్యాచారానికి పాల్పడి ఆపై అబార్షన్ చేయించిన వ్యక్తిపై మదనపల్లె వన్టౌన్ పోలీసులు గురువారం రాత్రి కేసు నమోదు చేశారు. సీఐ ఎరిసావలి తెలిపిన వివరాల మేరకు.. మదనపల్లె బెంగళూరు రోడ్డులోని ఓ ఆసుపత్రిలో మేనేజర్గా పనిచేస్తున్న రాజేశ్ అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్స్పై అత్యాచారం చేశాడు. ఈ మేరకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Similar News
News March 28, 2025
సల్మాన్ ఖాన్పై సౌత్ ఆడియన్స్ విమర్శలు

సల్మాన్ ఖాన్ సౌత్ ఆడియన్స్పై తాజాగా చేసిన వ్యాఖ్యల పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తమ సినిమాల్ని <<15910211>>దక్షిణ రాష్ట్రాల వాళ్లు చూడట్లేదని<<>> సల్మాన్ వాపోయిన సంగతి తెలిసిందే. మేం చూడకుండానే ప్రేమపావురాలు, ప్రేమాలయం, క్రిష్, 3 ఇడియట్స్, ధూమ్, ధూమ్ 2, బజరంగీ భాయ్జాన్ వంటి అనేక సినిమాలు హిట్ అయ్యాయా అంటూ పలువురు సినీ ప్రేమికులు నెట్టింట సల్మాన్ను ప్రశ్నిస్తున్నారు.
News March 28, 2025
అనకాపల్లి: ఉప ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్

అనకాపల్లి జిల్లాలో జరిగిన ఎంపీపీ ఉప ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అనకాపల్లి జిల్లాలో నాలుగు ఎంపీపీ, రెండు వైస్ ఎంపీపీ స్థానాలకు గురువారం ఎన్నికలు జరిగాయి. వీటిలో మాకవరపాలెం, ఎస్.రాయవరం, దేవరాపల్లి, వి.మాడుగుల ఎంపీపీ స్థానాలు వైసీపీ కైవసం చేసుకుంది. ఇక వైస్ ఎంపీపీలుగా చోడవరంలో వైసీపీ గెలుపొందగా.. సబ్బవరంలో ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు.
News March 28, 2025
GNT: మైనర్ బాలికతో ప్రేమ పెళ్లి.. పోక్సో కేసు నమోదు

బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న యువకుడు 9వ తరగతి చదువుతున్న మైనర్ బాలికను వివాహం చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఆ యువకుడిపై పట్టాభిపురం పీఎస్లో పోక్సో కేసు నమోదైంది. ఇద్దరూ పెళ్లి చేసుకున్న విషయాన్ని ఇరు కుటుంబాలు గోప్యంగా ఉంచాయి. ఆ మైనర్ బాలిక మరో వ్యక్తితో చాటింగ్ చేస్తుండటంతో ఆ కుటుంబాల్లో గొడవలు జరిగాయి. దీంతో వారు స్టేషన్ మెట్లు ఎక్కడంతో పెళ్లి జరిగి 8 నెలలైందని పోలీసులు గుర్తించారు.