News April 2, 2025
అన్నమయ్య యువతికి ఆల్ ఇండియా ర్యాంక్

CA ఫైనల్ ఫలితాల్లో అన్నమయ్య జిల్లా యువతి సత్తా చాటింది. తంబళ్లపల్లె(M) కన్నెమడుగుకు చెందిన తేజశ్విని ఆల్ ఇండియా 14వ ర్యాంకు సాధించింది. దీంతో ఆమెను MLA పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి అభినందించారు. YCP నాయకులతో కలసి తేజశ్వినిని శాలువాతో సన్మానించారు. మరింత ఉన్నత స్థాయికి ఎదిగి తంబళ్లపల్లె పేరును అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింపజేయాలని ఆకాంక్షించారు.
Similar News
News November 18, 2025
వేములవాడ: శరవేగంగా రాజన్న ఆలయాభివృద్ధి పనులు

వేములవాడ రాజన్న ఆలయం అభివృద్ధి, విస్తరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే ఆలయానికి సంబంధించిన పలు కట్టడాలను కూల్చివేశారు. కాగా, ఆలయం ఆవరణలోని స్వామివారి అద్దాల మండపం కూల్చివేత పనులను మంగళవారం ఉదయం ప్రారంభించారు. ఒకవైపు దక్షిణ ప్రాకారం తొలగింపు, మరోవైపు అద్దాల మండపం తొలగింపు పనులు కొనసాగుతున్నాయి. ఇక అభివృద్ధి పనుల నిమిత్తం రాజన్న ఆలయంలో దర్శనాలను నిలిపివేసిన విషయం తెలిసిందే.
News November 18, 2025
వేములవాడ: శరవేగంగా రాజన్న ఆలయాభివృద్ధి పనులు

వేములవాడ రాజన్న ఆలయం అభివృద్ధి, విస్తరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే ఆలయానికి సంబంధించిన పలు కట్టడాలను కూల్చివేశారు. కాగా, ఆలయం ఆవరణలోని స్వామివారి అద్దాల మండపం కూల్చివేత పనులను మంగళవారం ఉదయం ప్రారంభించారు. ఒకవైపు దక్షిణ ప్రాకారం తొలగింపు, మరోవైపు అద్దాల మండపం తొలగింపు పనులు కొనసాగుతున్నాయి. ఇక అభివృద్ధి పనుల నిమిత్తం రాజన్న ఆలయంలో దర్శనాలను నిలిపివేసిన విషయం తెలిసిందే.
News November 18, 2025
శంషాబాద్లో ర్యాగింగ్ కలకలం 2 వర్గాలుగా మారి గొడవ

శంషాబాద్లోని మీటా మైండ్ అకాడమీ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ర్యాగింగ్ ఘటనతో ఉద్రిక్తత నెలకొంది. 2nd ఇయర్ విద్యార్థులు 1st ఇయర్ విద్యార్థులపై ర్యాగింగ్కు పాల్పడటంతో ఘర్షణ చెలరేగింది. ఇరువర్గాల విద్యార్థులు పరస్పరం దాడులు చేసుకోవడంతో పలువురు గాయపడ్డారు. హాస్టల్ విద్యార్థులపై డేస్కాలర్ విద్యార్థులు స్థానిక గ్యాంగ్ సహాయంతో దాడి చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు రావడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


