News September 5, 2025

అన్నమయ్య: 1161.95 మెట్రిక్ టన్నులు యూరియా

image

అన్నమయ్య జిల్లాలో నేటికి యూరియా 1161.95 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నాదని గురువారం జిల్లా కలెక్టర్ శ్రీధర్ ప్రకటించారు. మార్క్ ఫెడ్ ద్వారా 49.95 మెట్రిక్ టన్నులు, రైతు సేవా కేంద్రాలు ద్వారా 608 మెట్రిక్ టన్నులు, ప్రైవేట్ ఫర్టిలైజర్ షాపులు ద్వారా 504 మెట్రిక్ టన్నులు యూరియా అందుబాటులో ఉన్నాదన్నారు. రైతులు అవసరాన్ని తక్షణమే తీర్చడానికి అన్ని కేంద్రాలలో యూరియా అందుబాటులో ఉన్నాదని కలెక్టర్ అన్నారు.

Similar News

News September 7, 2025

జగిత్యాలలో ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానం

image

జగిత్యాలలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, జిల్లా కలెక్టర్‌తో కలిసి ఉపాధ్యాయులకు అవార్డులను అందజేశారు. ఉపాధ్యాయులు కేవలం పాఠాలు చెప్పడమే కాకుండా, సమాజానికి మార్గదర్శకులుగా నిలుస్తారని మంత్రి కొనియాడారు. ఉత్తమ ఉపాధ్యాయులు తమ సేవలకు గుర్తింపు పొందినందుకు అభినందనలు తెలిపారు.

News September 7, 2025

మేఘాద్రి గడ్డలో పడి ఇద్దరు యువకులు మృతి

image

మేఘాదిగడ్డ రిజర్వాయర్లో ఆదివారం ఇద్దరు యువకులు మృతి చెందారు. కార్మికనగర్, JNRM కాలనీకి చెందిన యువకులు చేపలు పట్టడానికి రిజర్వాయర్‌కి వచ్చారు. కింద పడిన చెప్పు తీసే క్రమంలో ప్రమాదవశాత్తు మునిగిపోయారు. వీరిలో బెల్లంకి శేఖర్, లక్ష్మణ్ కుమార్ చనిపోయారు. మరో యువకుడు వాసును స్థానికులు కాపాడారు. సమాచారం అందుకున్న పెందుర్తి సీఐ సతీశ్ కుమార్ తన సిబ్బందితో సంఘటనా స్థలికి చేరుకొని మృతదేహాలను వెలికి తీశారు.

News September 7, 2025

వచ్చే ఎన్నికల నాటికి BRS కనుమరుగు: మహేశ్ గౌడ్

image

TG: బీసీ రిజర్వేషన్లపై కేంద్రం దిగి వచ్చేలా ఈ నెల 15న కామారెడ్డి సభ ఉండనుందని TPCC చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు. BJP నేతలు దేవుడి పేరు చెప్పుకొని ఓట్లు అడుక్కుంటారని ఫైరయ్యారు. లిక్కర్ రాణిగా కవిత నిజామాబాద్‌కు చెడ్డపేరు తీసుకొచ్చారని విమర్శించారు. కవిత ఎపిసోడ్ KCR ఆడించే డ్రామా అని సందేహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు ఆదరించే పరిస్థితి లేదని, వచ్చే ఎన్నికల నాటికి BRS కనుమరుగవుతుందన్నారు.