News February 23, 2026

అన్నమయ్య: 40 ఏళ్ల వ్యక్తితో అమ్మాయి పరార్

image

అన్నమయ్య జిల్లా ములకలచెరువులో మైనర్ అదృశ్యం కలకలం రేపింది. సీఐ వెంకటేశులు వివరాల మేరకు.. మండలంలోని నాయనిచెరువుపల్లె గ్రామానికి చెందిన ఓ వ్యక్తి(40)కి వివాహమై ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆయనకు 17 ఏళ్ల యువతితో పరిచయమైంది. ఈనెల 19వ తేదీ రాత్రి నుంచి యువతి కనిపించడం లేదు. ప్రేమ పేరుతో యువతి ఆ 40 ఏళ్ల వ్యక్తితో వెళ్లిపోయినట్లు ప్రాథమికంగా తమకు తెలిసిందని సీఐ తెలిపారు.

Similar News

News February 23, 2026

విశాఖ: సేవ పునర్విక పేరుతో దోపిడీ

image

విశాఖపట్నం రైల్వే స్టేషన్ రిజర్వేషన్ కార్యాలయం ఎదురుగా సోమవారం సేవ్ పునర్విక పేరుతో స్కానర్లు పట్టుకుంటూ సేవ పేరుతో ముగ్గురు వ్యక్తులు అనధికార దోపిడీకి తెర లేపారు. కనీసం ఆ పాప పేరు పలకడం తెలియడం లేదు వాళ్లకి, అలాగే మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే భీమవరానికి చెందిన వారిమని చెబుతున్నారు. స్థానికులు కాదు సేవ తప్పు దోవ పడుతుందంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

News February 23, 2026

నారాయణపేట: MLAకు మద్దతుగా BJP నిరసన

image

నారాయణపేట జిల్లా మరికల్‌లో సోమవారం బీజేపీ నేతలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. బీజేపీ కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు గూండాగిరి చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మండలాధ్యక్షుడు మంగలి వేణుగోపాల్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

News February 23, 2026

అష్టలక్ష్మి: సంతానలక్ష్మి అమ్మవారిని ఎలా పూజించాలంటే?

image

సంతానలక్ష్మి దేవికి పచ్చని వస్త్రాలు, పూలను సమర్పించి ఆరాధించాలి. పచ్చ రంగు వంశాభివృద్ధికి, చిగురించడానికి సంకేతం. ఓ మొక్క ఎలాగైతే పచ్చగా ఉండి కొత్త కొమ్మలను ఇస్తుందో అలాగే వంశాన్ని ముందుకు తీసుకెళ్లే సంతానాన్ని ఈ దేవి ప్రసాదిస్తుంది. పచ్చని పుష్పాలతో పూజిస్తే సంతాన దోషాలు పోతాయని నమ్మకం. అలాగే పుట్టిన పిల్లలు ఆరోగ్యంగా, బుద్ధిమంతులుగా పెరుగుతారని పండితులు చెబుతున్నారు.