News July 14, 2024

‘అప్పుడు అరగంటలో పంపారు.. ఇప్పుడు నంద్యాల ఎస్పీగా వస్తున్నారు’

image

ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనరేట్‌లో డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌గా పనిచేస్తున్న అధిరాజ్‌ సింగ్‌ రాణాను నంద్యాల ఎస్పీగా బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఆయన 2018 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన అధికారి. గతంలో ఆదోని ఏఎస్పీగా అధిరాజ్‌సింగ్‌ రాణాకు బాధ్యతలు అప్పగించారు. బాధ్యతలు తీసుకున్న అరగంటలోనే అప్పటి పాలకులు బదిలీ చేయించారు. ప్రస్తుతం నంద్యాలకు ఎస్పీగా రానున్నారు.

Similar News

News October 7, 2024

కర్నూలు: కాల్వబుగ్గ దేవాదాయ శాఖ అధికారి భారీ కుంభకోణం?

image

కర్నూలు కాల్వబుగ్గ దేవాదాయ శాఖ అధికారి చేతివాటం ప్రదర్శించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. కాగా ఆయన ప్రస్తుతం వేరే ప్రాంతానికి బదిలీ అవ్వగా అసలు విషయాలు బయటపడ్డాయి. ఆయన ఆలయం పేరిట సొంత ఖాతా తెరచి రూ.1.30 కోట్లు దారి మళ్లించినట్లు తెలుస్తోంది. బినామీలు, సిబ్బంది పేరిట డబ్బులు విత్ డ్రా చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

News October 7, 2024

నందికొట్కూరు: రూ.100కి చేరిన టమాటా

image

నందికొట్కూరులో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ముఖ్యంగా టమాటా ధర అమాంతం పెరిగింది. హోల్సేల్ మార్కెట్లో టమోటా ధర రూ.70 -80 పలుకుతోంది. నందికొట్కూరు సంత మార్కెట్ లో సోమవారం రిటైల్ మార్కెట్లో టమాటా ధర రూ.100 దాటిందని కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేశారు. భారీ వర్షాలకు పంట దెబ్బతినడంతో ఉల్లి ధర కూడా రూ.70- 80 కి చేరిందన్నారు.

News October 7, 2024

డోన్‌: హత్య కేసులో ఐదుగురి అరెస్ట్

image

డోన్‌లోని కొండపేట వాసి షేక్ మదార్‌వలిపై గతనెల17న హత్యాయత్నం చేయగా కర్నూలులో చికిత్స పొందుతూ 26వ తేదీ మృతి చెందారు.ఈ కేసుకు సంబంధించి వ్యక్తిని కొట్టి చంపిన ఐదుగురిని రిమాండ్‌కి పంపినట్లు సీఐ ఇంతియాజ్ బాషా తెలిపారు. వారిని గుత్తిరోడ్డులోని మార్కెట్ యార్డ్ వద్ద ఆదివారం అరెస్ట్ చేశామన్నారు. హరికృష్ణ, చెన్నకేశవులు, రంగమని, మౌలాలి, శివసాయి కలిసి వలిని కర్రలతో, రాడ్లతో కొట్టినట్లు సీఐ తెలిపారు.