News June 10, 2024
అప్పుడు కృష్ణంరాజు.. ఇప్పుడు భూపతిరాజు
నరసాపురం MPగా తొలిసారి ఎన్నికైన భూపతిరాజు శ్రీనివాసవర్మను కేంద్ర మంత్రి పదవి వరించింది. ఈ నియోజకవర్గం 1952లో ఆవిర్భవించింది. సినీ నటుడు కృష్ణంరాజు(BJP) తొలిసారి కాకినాడ MPగా గెలవగా.. 1999లో నరసాపురం నుంచి గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు. పాలకొల్లుకు చెందిన దర్శకుడు దాసరి నారాయణరావు, మొగల్తూరుకు చెందిన మెగాస్టార్ చిరంజీవి, నరసాపురం కోడలు నిర్మలా సీతారామన్ రాజ్యసభ నుంచి ఎన్నికై కేంద్ర మంత్రిగా చేశారు.
Similar News
News September 29, 2024
సెప్టెంబర్ 30న ఉమ్మడి ప.గో. విద్యార్థులకు పోటీలు
ఉమ్మడి ప.గో. జిల్లాలోని విద్యార్థులకు సెప్టెంబర్ 30న ‘సేవ్ ది గర్ల్’ అంశంపై వ్యాసరచన, డెబిట్, చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తామని ఆయా జిల్లాల శాఖ అధికారులు శనివారం తెలిపారు. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ఈ పోటీలు చేపడుతున్నామన్నారు. మొదటి విజేతకు రూ.5 వేలు, 2వ విజేతకు రూ.3 వేలు, 3వ విజేతకు 2 వేలను బహుకరిస్తామని స్పష్టం చేశారు. అక్టోబర్ 1న భీమవరం పీఎస్ఎం బాలికల ఉన్నత పాఠశాలలో పోటీలు ఉంటాయన్నారు.
News September 28, 2024
ఏలూరు: వైసీపీ మాజీ MLAపై కేసు నమోదు
ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని)పై త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం.. అవుటుపల్లి నాగమణి అనే మహిళ కోర్టులో ఫిర్యాదు చేయగా.. కోర్టు ఆదేశాల మేరకు ఆళ్ల నాని అతని అనుచరులపై కేసు నమోదు చేశామని శనివారం పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News September 28, 2024
పాలకొల్లులో మంత్రి నారాయణ రేపటి పర్యటన ఇలా..
మంత్రి నారాయణ ఆదివారం పాలకొల్లులో పర్యటించనున్నారనిి అధికారులు శనివారం తెలిపారు. ఉదయం 10 గంటలకు పాలకొల్లు మున్సిపల్ హెడ్ వాటర్ వర్క్స్ను పరిశీలిస్తారన్నారు. 10:40కి అబ్దుల్ కలాం పార్క్, 10:50 గంటలకు సీబీఎన్ ఉద్యానవనం, 11 గంటలకు ఎన్టీఆర్ కళాక్షేత్రం, 11:10 గంటలకు అన్న క్యాంటీన్, 12:50 గంటలకు టిడ్కో ఇళ్ల వద్ద ప్రెస్ మీట్ ఉంటుందన్నారు. 2:30 గంటలకు మున్సిపల్ ఆఫీసులో రివ్యూ నిర్వహిస్తారన్నారు.