News March 20, 2024

అప్పుల బాధతో కొత్త పోలవలస సర్పంచ్ అదృశ్యం

image

కొత్త పోలవలస సర్పంచ్ అదృశ్యమైన ఘటన మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే నరసన్నపేట మండలం కొత్త పోలవలస సర్పంచ్ వెంకట శ్యామ్‌కుమార్ బుధవారం తెల్లవారుజాము నుంచి అదృశ్యమైనట్లు ఆయన భార్య ప్రశాంతి తెలిపారు. ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేశారు. ఇటీవల పలువురి నుంచి నగదు అప్పుగా తీసుకుని.. అది తీర్చలేక పోవడంతోనే మనస్తాపం చెంది వెళ్లిపోయారని తెలిపారు.

Similar News

News July 3, 2024

శ్రీకాకుళం: శుభకార్యానికి వెళ్తుండగా హత్య

image

పొందూరు మండలం చిన్న బొడ్డేపల్లికి చెందిన రాజేశ్వరి(30) హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే
మంగళవారం సంతకవిటి మండలం వాల్తేరులో శుభకార్యానికి ఇద్దరు ఆటోలో బయలుదేరారు. ఆటోలో వాల్తేరు వెళ్తుండగా తాడివలస సమీపంలో ఇద్దరి మధ్య వివాదం జరిగింది. గోపాల్‌ తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె మెడపై పలుమార్లు దాడి చేయగా.. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News July 3, 2024

హత్రస్ బాధితులకు మంత్రి రామ్మోహన్ సానుభూతి

image

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హత్రస్ తొక్కిసలాట బాధితులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ట్వీట్ చేశారు. మంగళవారం యూపీలోని హత్రస్ జిల్లాలో జరిగిన తొక్కిసలాటలో 116 మంది చనిపోవడం, పలువురు గాయపడటం బాధాకరమని రామ్మోహన్ Xలో పోస్ట్ చేశారు.

News July 3, 2024

శ్రీకాకుళంలో 3రోజులు వర్షాలు

image

ఉత్తరాంధ్ర ప్రాంతాలలో ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో రానున్న 3 రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈనెల 3, 4, 5 తేదీల్లో జిల్లాలో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని సంస్థ ఎండీ కూర్మనాథ్ తెలిపారు. రేపు మబ్బులతో కూడి అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది.