News February 8, 2025

అబిడ్స్ DIపై భార్య ఫిర్యాదు

image

అబిడ్స్ పోలీస్ స్టేషన్ డీఐ నరసింహపై ఆయన భార్య సంధ్య హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అదనపు కట్నం కోసం మానసికంగా, శారీరకంగా చిత్రహింసలు పెడుతున్నారని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. పెళ్లై 12 ఏళ్లు అవుతుందని, తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, అదనపు కట్నం ఇవ్వకపోతే రెండో పెళ్లి చేసుకుంటానని బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.

Similar News

News February 8, 2025

పాడేరు: ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలి

image

ఆకాంక్ష జిల్లాల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షులు సుమన్ కుమార్ బేరీ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో ఆకాంక్ష బ్లాక్‌ల అభివృద్ధిపై సమావేశం నిర్వహించారు. మారుమూల గ్రామాలు మరింత వేగంగా అభివృద్ధి చెందాలన్నారు. వైద్య ఆరోగ్య సేవలు, పోషకాహారం, వ్యవసాయం నీటిపారుదల సదుపాయాలు, ఆర్థిక చేకూర్పు, నైపుణ్యాభివృద్ధి మారుమూల గ్రామాలకు కనీస సౌకర్యాలు కల్పించాలన్నారు.

News February 8, 2025

కొత్త రేషన్ కార్డులకు ఈసీ బ్రేక్

image

తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. కొత్త రేషన్ కార్డులకు మీసేవలో దరఖాస్తులకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించగా.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ దృష్ట్యా వాటిని తక్షణమే నిలిపివేయాలని ఈసీ ఆదేశించింది.

News February 8, 2025

కాంగ్రెస్ దీనస్థితి చూస్తే జాలి కలుగుతోంది: కిషన్ రెడ్డి

image

అవినీతికి పాల్పడితే ఏం జరుగుతుందో ఢిల్లీ ఫలితాలే ఉదాహరణ అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ‘అవినీతిపై పోరాటమంటూ కేజ్రీవాల్ రాజకీయాల్లోకి వచ్చారు. చివరికి అతడే అవినీతికి చిరునామాగా మారారు. కాంగ్రెస్ దీనస్థితి చూస్తే అందరికీ జాలి కలుగుతోంది. ఢిల్లీలో వరుసగా 3 సార్లు డకౌట్ అయింది. అసలు గెలవాలనే ఆలోచన కాంగ్రెస్‌కు ఎప్పుడూ ఉండదు. మోదీని, BJPని ఓడించాలని మాత్రమే రాహుల్ ఆలోచిస్తారు’ అని విమర్శించారు.

error: Content is protected !!