News October 6, 2025

అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద హెవీ ట్రాఫిక్ జామ్

image

విజయవాడ జాతీయ రహదారిపై తెల్లవారుజాము వరకు ట్రాఫిక్ జామ్ కొనసాగింది. పండగకు ఊరెళ్లిన నగరవాసులు భారీ మొత్తంలో తిరుగు ప్రయాణం అవ్వడంతో రద్దీ నెలకొంది. దీంతో వెహికల్స్ స్లోగా కదిలాయి. సిటీలోకి ఎంటరయ్యే అబ్దుల్లాపూర్‌మెంట్ వద్ద రోడ్డు కంజస్ట్‌గా ఉండడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోందని పలువురు చెబుతున్నారు. వెళ్లేటప్పుడు హయత్‌నగర్‌- మెట్టు, తిరిగొచ్చేటప్పుడు మెట్టువద్ద వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

Similar News

News April 14, 2026

తెలంగాణ ఫలితాల్లో సిక్కోలు వలస కూలీ బిడ్డ సంచలనం

image

వజ్రపుకొత్తూరు(M) గుణుపల్లికి చెందిన వలస కూలీ కుమార్తె గుండుపల్లి స్వాతి తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో (MPC) 470కి 468 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్‌గా నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా ఏడుగురు ఈ మార్కులు సాధించగా, అందులో స్వాతి ఒకరు కావడం విశేషం. నిరుపేద కుటుంబం నుంచి వచ్చి రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటిన స్వాతిని ఉద్దాన ప్రజలు అభినందిస్తున్నారు. ఈ ఘనత జిల్లాకు గర్వకారణమని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News April 14, 2026

చిత్తూరు జిల్లా ‘మండుతోంది’

image

చిత్తూరు జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. సోమవారం ఏడు మండలాల్లో దాదాపు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు దాటాయి. అత్యధికంగా తవణంపల్లెలో 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నగరి, రొంపిచెర్లలో 40.7, శ్రీరంగరాజపురంలో 40.6, నిండ్రలో 40.5, గంగవరంలో 40.3, విజయపురంలో 40.0, పెద్దపంజాణిలో 39.6, బంగారుపాళ్యం, పులిచెర్ల మండలాల్లో 39.5 డిగ్రీల టెంపరేచర్ నమోదయింది.

News April 14, 2026

ఆదిలాబాద్: హెల్మెట్ తీర్మానం.. ఆదర్శంగా నిలిచిన జామిడి

image

99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాకు వచ్చిన డీజీపీ శివధర్ రెడ్డికి జామిడి సర్పంచ్ ఈరగొల్ల అశోక్ వినూత్నమైన తీర్మానాన్ని అందజేశారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరిస్తామని, ఇతర గ్రామాల వారు కూడా హెల్మెట్ ఉంటేనే తమ గ్రామంలోకి రావాలన్న నిర్ణయాన్ని ఎస్పీ అఖిల్ మహాజన్ సమక్షంలో వివరించారు. ఈ బాధ్యతాయుతమైన నిర్ణయాన్ని డీజీపీ అభినందించారు.