News October 27, 2025

అభయారణ్యంలోకి 29 వరకు సందర్శకుల రాక నిషేధం

image

తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో సోమవారం నుంచి ఈనెల 29 వరకు కోరింగ అభయారణ్యంలోకి సందర్శకుల రాకను నిషేధించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్లు అధికారి వరప్రసాద్ తెలిపారు. అటు ఇప్పటికే తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం అప్రమత్తం కాగా.. ఉప్పాడ, కొత్తపల్లి సహా 6 మండలాల్లో ప్రత్యేక దృష్టి సారించారు. అటు ఈనెల 31 వరకు విద్యార్థులకు హాలిడే ప్రకటించారు.

Similar News

News October 27, 2025

మంచిర్యాల: చికిత్స పొందుతూ యువకుడి మృతి

image

మనస్తాపం చెంది యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన దండేపల్లి మండలంలో జరిగింది. SI తహిసీనోద్దీన్ ప్రకారం.. గుడిరేవుకు చెందిన అన్వేష్(22) డిగ్రీ చదువుతున్నాడు. ఫ్రెండ్స్‌తో టూర్‌కి వెళ్లడానికి తండ్రిని డబ్బులు అడగగా లేవని మందలించాడు. మనస్తాపం చెందిన అన్వేష్ ఈనెల 11న పురుగుమందు తాగి స్టేటస్ పెట్టాడు. ఇది చూసిన స్నేహితులు తండ్రికి సమాచారం అందించగా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు.

News October 27, 2025

మెుంథా తుఫాన్ ఇంకా ఎంత దూరం ఉందంటే.!

image

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరింత బలపడి తుఫానుగా మారనుందని APSDMA తెలిపింది. ఇది చెన్నైకి 640 కి.మీ, విశాఖపట్నానికి 740 కి.మీ, కాకినాడకు 710 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. రేపు ఉదయానికి తీవ్ర తుఫానుగా మారి రాత్రికి తీరం దాటే అవకాశం ఉంది. నేడు కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

News October 27, 2025

పిట్లం: తండ్రికి కల్లులో విషం.. కొడుకు ఘాతుకం..!

image

వృద్ధుడైన తండ్రికి సేవ చేయడం భారంగా భావించిన ఆ కొడుకు.. తండ్రి తాగే కల్లులో విషం కలిపి హత్య చేశాడు. ఈ ఘటన పిట్లం(M) గౌరారం తండాలో శుక్రవారం జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. SI వెంకట్రావ్ ప్రకారం.. తండావాసి దశరథ్ కొడుకు వామన్ వద్దుంటున్నాడు. తండ్రికి వృద్ధాప్య సేవలు చేయలేక వామన్ కల్లులో విషం కలిపి ఇచ్చి హతమార్చాడు. కేసు నమోదు చేసి, నిందితుడైన వామన్‌ను ఆదివారం రిమాండ్‌కు తరలించారు