News February 18, 2025

అభా కార్డుల నమోదు పూర్తి చేయాలి: బాపట్ల కలెక్టర్

image

అభా కార్డుల నమోదు ప్రక్రియ పది రోజుల్లో పూర్తి చేయాలని బాపట్ల కలెక్టర్ కలెక్టర్ వెంకట మురళి సోమవారం చెప్పారు. ఇప్పటివరకు పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో 85% సర్వే పూర్తి అయ్యిందన్నారు. వేటపాలెం, కర్లపాలెం, యద్దనపూడి మండలాలలో ఈ ప్రక్రియ జాప్యంపై అరా తీశారు. సత్వరమే నూరు శాతానికి ఈ ప్రక్రియ చేరుకునేలా మండల స్థాయిలో ఎంపీడీవోలు, ఎంఈవోలు, వైద్య అధికారులతో బృందాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

Similar News

News March 14, 2025

గోపాల మిత్రుల ఆధ్వర్యంలో రూ. లక్ష ఆర్థిక సహాయం

image

సిద్దిపేట మండలానికి చెందిన గోపాలమిత్ర మార్గడి వెంకట్ రెడ్డి ఇటీవల మృతి చెందారు. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లా గోపాలమిత్ర సంఘం సభ్యుల ఆధ్వర్యంలో గురువారం మృతుడి కుటుంబాన్ని పరామర్శించి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా గోపాల మిత్ర అధ్యక్షుడు సింగం రాజు యాదవ్, రాష్ట్ర సలహాదారు శ్రీరాములు, సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి మహిపాల్ రెడ్డి ఉన్నారు.

News March 14, 2025

హిందీ పరీక్ష రాసేందుకు ఆ విద్యార్థులకు మరో ఛాన్స్

image

హోలీ పండగ కారణంగా రేపు హిందీ పరీక్ష రాయలేని సీబీఎస్ఈ 12వ తరగతి విద్యార్థులకు మరో అవకాశం కల్పిస్తామని బోర్డు తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో పండగ మార్చి 15న నిర్వహించుకుంటున్నారని ఎగ్జామ్ కంట్రోలర్ సంయమ్ భరద్వాజ్ తెలిపారు. పరీక్షను షెడ్యూల్ ప్రకారమే నిర్ణయించినా రేపు ఎగ్జామ్ రాయలేని స్పోర్ట్స్ కోటా విద్యార్థులకు మరో అవకాశం ఇస్తామని పేర్కొన్నారు. తేదీని త్వరలోనే వెల్లడిస్తామన్నారు.

News March 14, 2025

మెదక్: ఏప్రిల్ 20 నుంచి ఓపెన్ పరీక్షలు

image

ఓపెన్ స్కూల్ పదవతరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు ఏప్రిల్ 20 నుండి 26 వరకు(థియరీ) నిర్వహిస్తున్నట్లు మెదక్ డీఈఓ ప్రొ. రాధాకిషన్ తెలిపారు. 26 నుంచి మే 3 వరకు ఇంటర్మీడియట్(ప్రాక్టికల్) పరీక్షలు ఉదయం 9గంటల నుంచి 12గంటల వరకు, మధ్యాహ్నం 2:30గం. నుంచి 5:30 వరకు ఉంటాయన్నారు. పరీక్ష రుసుము చెల్లించిన వారు ఈ పరీక్షలు రాయడానికి అర్హులని చెప్పారు.

error: Content is protected !!