News February 27, 2026
అభిషేక్ పోస్ట్.. చెప్పు చూపించిన యువీ!

T20WC: నిన్నటి మ్యాచ్లో రాణించడాన్ని యువ క్రికెటర్ అభిషేక్ శర్మ ఇన్స్టా పోస్ట్తో సెలబ్రేట్ చేసుకోగా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తనదైన శైలిలో స్పందించారు. అభిషేక్ పోస్టుకు సరదాగా ఓ చెప్పు ఎమోజీని పెట్టారు. గతంలోనూ యువీ అభిషేక్కు ఈ తరహా ఎమోజీలు పెట్టారు. ఆటపై మరింత దృష్టిపెట్టాలని హెచ్చరించడమే దీని ఉద్దేశం. మరోవైపు అభిషేక్ ప్రదర్శనను మెచ్చుకుంటూ ఇన్స్టాలో యువరాజ్ స్టోరీ పోస్ట్ చేశారు.
Similar News
News March 2, 2026
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

AP: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్ లేనివారికి శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోంది. కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి శిలాతోరణం వరకు భక్తుల క్యూ ఉంది. నిన్న 83,112 మంది వేంకటేశ్వరుడిని దర్శించుకోగా 30,054 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.49కోట్లు వచ్చినట్లు TTD తెలిపింది. రేపు చంద్ర గ్రహణం సందర్భంగా ఆలయాన్ని మూసేయనున్నారు.
News March 2, 2026
IAFలో అగ్నివాయు నాన్ కంబాటెంట్ పోస్టులు

ఇండియన్ ఎయిర్ఫోర్స్(IAF)లో అగ్నివాయు నాన్ కంబాటెంట్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. టెన్త్ అర్హతతో పాటు శారీరక ప్రమాణాలు కలిగిన వారు ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. జులై 2, 2005-జనవరి 2, 2009 మధ్య జన్మించి ఉండాలి. స్క్రీనింగ్, రాత పరీక్ష, PFT, మెడికల్ టెస్ట్, DV ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://agnipathvayu.cdac.in
News March 2, 2026
సంచలన ఆరోపణ.. మావోలపై విషపు తూటాలు?

నక్సల్స్ను అంతం చేసేందుకు ఎన్కౌంటర్లలో విషపు తూటాలు వాడారంటూ ఓ మావోయిస్టు అగ్రనేత ‘ఫినిక్స్’ పేరిట రాసిన కథనం సంచలనం రేపుతోంది. ‘బుల్లెట్ షెల్స్ తగిలిన సహచర మావోలు తీవ్రమైన నొప్పి, భరించలేని మంట, విపరీతమైన దాహం, వాంతులతో నరకం అనుభవించారు’ అని పేర్కొన్నారు. గతేడాది ఛత్తీస్గఢ్ గరియాబంద్ అడవుల్లో జరిగిన భీకర ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్న ఆయన పార్టీకి రాసిన లేఖలో ఈ విషయాలు వెల్లడించారు.


