News November 6, 2025

అమరరాజా ఫ్యాక్టరీలో భారీ చోరీ..

image

యాదవరి మండలంలోని అమరరాజా బ్యాటరీ ఫ్యాక్టరీలో భారీ చోరీని పోలీసులు ఛేదించారు. రూ.2.73 కోట్ల విలువైన లెడ్ బుష్ మాయంపై కంపెనీ ప్రతినిధులు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా ఏడుగురిని అరెస్టు చేసి దీనికి సంబంధించి రూ. 82 లక్షల విలువ చేసే మెటీరియల్, రూ. 68 లక్షల నగదు, రూ.1.18 కోట్ల విలువచేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. సంస్థ ఉద్యోగుల సహకారంతో చోరీ జరిగినట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News November 6, 2025

పెరిగిన బంగారం, వెండి ధరలు

image

గత రెండు రోజులుగా తగ్గిన బంగారం ధరలు ఇవాళ పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రా. గోల్డ్ రూ.430 పెరిగి రూ.1,21,910కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రా. పసిడి రూ.400 పెరిగి రూ.1,11,750 పలుకుతోంది. అటు కేజీ వెండి రేటు రూ.1,000 పెరిగి రూ.1,64,000గా ఉంది.

News November 6, 2025

HYD: మీర్జాగూడ యాక్సిడెంట్.. యువకుడి మెసేజ్ వైరల్!

image

ట్రాఫిక్ రూల్స్‌పై ప్రజల్లో చైతన్యం పెంచేందుకు ఓ యువకుడు చేసిన పని అందరినీ ఆలోచింపజేస్తోంది. ‘రూల్స్ ఎప్పుడూ ఇబ్బందిగా అనిపిస్తాయి. మన ప్రాణాలు కాపాడేవి అవే. త్వరగా వెళ్లాలంటే ముందు జాగ్రత్తగా వెళ్లాలి. మీ ఇంటికెళ్తూ వేరే ఇళ్లల్లో కన్నీళ్లు మిగిల్చకండి’ అంటూ మూసాపేట్ మెట్రో స్టేషన్ సమీపంలో ఓ యువకుడు ఇలా ప్లకార్డులు పట్టుకొని కనిపించాడు. మీర్జాగూడ ఘటన నేపథ్యంలో యువకుడు ఇచ్చిన మెసేజ్ వైరలవుతోంది.

News November 6, 2025

పిడుగురాళ్లలో వ్యక్తి దారుణ హత్య

image

పిడుగురాళ్ల లెనిన్ నగర్‌కు చెందిన కొమ్ము సంతోష్ రావును స్నేహితుడు సుభాని బండరాళ్లతో కొట్టి చంపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తనతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని సంతోష్ రావు బలవంతం చేయగా సుభాని నిరాకరించాడు. దీంతో వారిద్దరి మధ్య గొడవ జరగటంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.