News November 25, 2025
అమరావతికి మహార్దశ.!

అమరావతిలో రాజధాని అభివృద్ధి నేపథ్యంలో విజయవాడ రైల్వే స్టేషన్కు నిరాశ మిగలనుంది. ప్రధాన రైల్వే జంక్షన్గా ఉన్న విజయవాడ స్టేషన్లో రద్దీ దృష్ట్యా 10 ప్లాట్ఫామ్స్కి అదనంగా 2 నిర్మించాలని రైల్వే శాఖ భావించింది. అయితే ఇప్పుడు ఈ అభివృద్ధి అమరావతిలో కొత్త టెర్మినల్ నేపథ్యంలో ప్లాట్ ఫామ్ విస్తరణను అధికారులు నిలిపివేశారు. వీటికి అయ్యే ఖర్చును రైల్వే శాఖ అమరావతి, గన్నవరం స్టేషన్లపై పెట్టనుంది.
Similar News
News November 25, 2025
మహిళాభివృద్ధి& శిశు సంక్షేమశాఖలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

AP: అనంతపురం జిల్లాలోని మహిళాభివృద్ధి& శిశు సంక్షేమశాఖలోని వన్ స్టాప్ సెంటర్లో 4 కాంట్రాక్ట్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. సైకో-సోషల్ కౌన్సెలర్, మల్టీ పర్పస్ స్టాఫ్, సెక్యూరిటీ గార్డ్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ/సైకాలజీ డిప్లొమా/న్యూరో సైన్స్ , టెన్త్ అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వెబ్సైట్: https://ananthapuramu.ap.gov.in/
News November 25, 2025
రంగారెడ్డి జిల్లాలో వార్డుల కేటాయింపు ఇలా

రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న 526 గ్రామ పంచాయతీల పరిధిలో 4,668 వార్డులు ఉన్నాయి. వీటిలో 100% ST జనాభా ఉన్న పంచాయతీల్లో 238 వార్డులు మహిళలకు కేటాయించారు. మరో 238 వార్డులను పురుషులు, మహిళలకు కేటాయించారు. ఇక జనరల్ పంచాయతీలో ST మహిళలకు 106, పురుషులకు 153 స్థానాలు కేటాయించారు. ఎస్సీ మహిళలకు 378 వార్డులు కేటాయించగా.. 522 స్థానాలు మహిళలు, పురుషులకు కేటాయించారు.
News November 25, 2025
ఈ నెల 28న ఓటీటీలోకి ‘మాస్ జాతర’

రవితేజ, శ్రీలీల జంటగా నటించిన ‘మాస్ జాతర’ మూవీ OTTలోకి రానుంది. ఈ నెల 28 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానున్నట్లు ఆ సంస్థ ట్వీట్ చేసింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించింది. అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది.


