News December 1, 2025
అమరావతిని ఉద్యోగాల కల్పనకు కేంద్రంగా మారుస్తా: CM

అమరావతిని ఉద్యోగాల కల్పనకు కేంద్రంగా మారుస్తున్నామని, మొదటి దశ పనులు 2028 నాటికి పూర్తవుతాయని సీఎం చంద్రబాబు అన్నారు. సోమవారం ఉంగుటూరు(M) నల్లమాడు సభలో ఆయన మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వం మరో 15-20 ఏళ్లు అధికారంలో ఉండాలని ఆకాంక్షించారు. గత పాలకుల ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో అభివృద్ధి ఊసే లేదని విమర్శించారు.
Similar News
News December 3, 2025
BREAKING: సత్తుపల్లి వద్ద ఘోరం.. ముగ్గురు మృతి

సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామం వద్ద ఈరోజు తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించారు. గృహప్రవేశ వేడుక కోసం చంద్రుగొండ నుంచి సత్తుపల్లికి వస్తుండగా, కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని సత్తుపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
News December 3, 2025
WGL: రెబల్స్ను బుజ్జగింపులు.. వేడెక్కిన రాజకీయాలు!

జిల్లాలో పంచాయతీ ఎన్నికల వేడి పెరిగింది. నేడు నామినేషన్ల ఉపసంహరణ కాగా, పార్టీ అభ్యర్థులతో పాటు రెబల్స్ కూడా నామినేషన్లు వేయడంతో పలు గ్రామాల్లో గట్టి పోటీ నెలకొంది. అధికార, ప్రతిపక్ష నేతలు రెబల్స్ను బుజ్జగించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈసారి తప్పుకో భవిష్యత్తులో అవకాశం ఇస్తాం అంటూ ఒప్పించే ప్రయత్నాలు సాగుతున్నాయి. కొన్ని గ్రామాల్లో స్వతంత్రులు బలంగా ఉండటం రాజకీయ సమీకరణాలను మార్చుతోంది.
News December 3, 2025
జిల్లా కేంద్రంగా రాజంపేట.. అర్హతలు ఇవే: JAC

రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించడానికి ఉన్న అర్హతలను JAC వివరించింది.
☛ 18 ఎకరాల విస్తీర్ణంలో సబ్ కలెక్టరేట్
☛ రాజ్యాంగ వ్యవస్థ ఏర్పడిన నాటినుంచి పార్లమెంట్ కేంద్రం
☛ వివిధ నగరాలకు రైళ్ల సదుపాయం
☛ కృష్ణపట్నం ఓడరేవుకు కనెక్టివిటీ
☛ కడప, రేణిగుంట ఎయిర్పోర్టుకు సమీపం
☛ చెయ్యేరు, పెన్నా నదులు ప్రవహించడం
<<18453435>>CONTINUE..<<>>


