News March 26, 2026

అమరావతిలో అగ్ని ప్రమాదాలు.. సిట్ ఏర్పాటు

image

AP: అమరావతిలో వరుసగా జరుగుతున్న <<19471226>>అగ్నిప్రమాదాలపై<<>> ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. గుంటూరు అడిషనల్ ఎస్పీ రవికుమార్ నేతృత్వంలో విచారణ జరగనుంది. వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని సర్కారు ఆదేశించింది. సిట్ బృందంలో DSP, నలుగురు సీఐలు, నలుగురు ఎస్సైలు ఉన్నారు. ఇటీవల L&T, మేఘా ఇంజినీరింగ్ కంపెనీల పైపులు దగ్ధమయ్యాయి. వీటి వెనుక కుట్ర ఉండొచ్చని సీఎం అనుమానం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

Similar News

News April 13, 2026

WGL: బర్త్‌డేలతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు..!

image

నర్సంపేటలోని శాంతినగర్‌లో నివాసం ఉంటున్న ఉప్పరపల్లికి చెందిన చింతకింది శివకృష్ణ, మౌనిక దంపతులకు ముగ్గురు సంతానం. కూతురు అక్షర 2020 జూన్ 3వ తేదీన జన్మించింది. రెండవ సంతానం అర్జున్ 2022, జూన్ 3వ తేదీన, మూడవ సంతానం ఆదిత్య 2024 జూన్ 3వ తేదీన జన్మించాడు. ముగ్గురూ ఒకే నెల, ఒకే తేదీన రెండేళ్ల వ్యవధిలో జన్మించడంతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు.

News April 13, 2026

స్మార్ట్ గవర్నెన్స్.. సింగపూర్‌కు 9 మంది మంత్రులు

image

AP: ప్రజలకు స్మార్ట్ గవర్నెన్స్‌ను అందించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా 9 మంది మంత్రులు, ఉన్నతాధికారులకు ట్రైనింగ్ ఇప్పించనుంది. ఈ నెల 21 నుంచి 27 వరకు నారాయణ, అచ్చెన్న, నాదెండ్ల, సత్యకుమార్, అనగాని, నిమ్మల, పయ్యావుల, అనిత, జనార్దన్ సింగపూర్‌లో పర్యటించనున్నారు. రోజుకొక అంశంపై వారం రోజులపాటు శిక్షణ ఉంటుంది. వారు తిరిగొచ్చాక ఇతర ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పిస్తారు.

News April 13, 2026

అన్నదాతకు ‘ఉల్లి’పోటు.. భారీగా పడిపోయిన ధర

image

TG: ఉల్లి ధరలు రైతులను కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. సంగారెడ్డి(D) సదాశివపేట మార్కెట్‌లో గతేడాది APRలో రూ.2,300 పలికిన క్వింటాల్ ఉల్లి తాజాగా రూ.504కు పడిపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 45 వేల ఎకరాల్లో ఉల్లి సాగవుతోంది. JAN-MAY మధ్య భారీగా దిగుబడి వస్తుంది. దీంతో ధరలు పతనమయ్యాయి. హైదరాబాద్ సహా చాలా ప్రాంతాల్లో వ్యాపారులు రూ.100కు 5-8 కిలోల వరకు ఉల్లి విక్రయిస్తున్నారు.