News November 24, 2025

అమరావతిలో ఏళ్లు గడుస్తున్నా పరిష్కారం కానీ సమస్యలు ఇవే..!

image

అమరావతి ప్రాంతంలో గ్రామ కంఠాలు, రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లకు సంబంధించిన వీధి పోట్లు సమస్య రైతులను తీవ్రంగా వెంటాడుతుంది. CRDA అధికారులు ఈ సమస్యలపై దృష్టి సారించకుండా కాలయాపన చేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. రాజధాని ఏర్పడిన నాటి నుంచి ఈ సమస్య పరిష్కరించకుండా ఒంటెద్దుపోకడి పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదంటున్నారు.

Similar News

News November 25, 2025

ALERT.. వాయుగుండంగా బలపడిన అల్పపీడనం

image

AP: మలక్కా జలసంధి ప్రాంతంలోని తీవ్ర అల్పపీడనం పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ వాయుగుండంగా బలపడిందని APSDMA తెలిపింది. ఇది నెమ్మదిగా కదులుతూ రాబోయే 48 గంటల్లో మరింత బలపడి తుఫానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఎల్లుండి నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది. తుఫాను ప్రభావంతో ఈ నెల 29 నుంచి డిసెంబర్ 2 వరకు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయంది.

News November 25, 2025

పసుపు రంగు మిర్చికి రెట్టింపు డిమాండ్

image

ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో పసుపు రంగు మిక్సీ రాకతో వ్యాపారం వేడెక్కింది. ఉత్తమ నాణ్యతతో మార్కెట్‌కు చేరిన పసుపు రంగు మిర్చికి వ్యాపారుల మధ్య పోటీ నెలకొనడంతో క్వింటాకు రూ.21,050 వరకు ధర పలికింది. రైతులు రకరకాల పంటలను మార్కెట్‌కు తీసుకువచ్చినప్పటికీ, పసుపు రంగు మిక్సీపై ప్రత్యేక డిమాండ్ నెలకొనడం గమనార్హం. అధిక ధర రావడం పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేశారు.

News November 25, 2025

నల్గొండ: ఆకట్టుకున్న ఇందిరమ్మ గృహప్రవేశం

image

మాడ్గులపల్లి మండలం పోరెడ్డిగూడెంలో ఇందిరమ్మ గృహప్రవేశం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలంతా ఇందిరమ్మ చీరలు కట్టుకున్నారు. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్‌తో కలిసి వారు ఫొటో దిగగా ఆకట్టుకుంటోంది.