News April 22, 2025
అమరావతిలో ప్రధాని మోదీ పర్యటనపై సమీక్ష

వచ్చే నెల 2న అమరావతిలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఈ మేరకు.. సోమవారం ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, పయ్యావుల కేశవ్, పొంగూరు నారాయణ పాల్గొన్నారు. పర్యటనకు సంబంధించి హెలిప్యాడ్లు, బహిరంగ సభ ప్రాంగణం, రహదారి అభివృద్ధి, భద్రత ఏర్పాట్లపై సమీక్ష చేశారు. ప్రధాని బహిరంగ సభకు సుమారు 5 లక్షల మంది హాజరయ్యే అవకాశముందని అంచనా వేశారు.
Similar News
News April 22, 2025
గుంటూరు జిల్లాలో తీవ్ర ఉత్కంఠ

రేపు టెన్త్ ఫలితాలు విడుదల కానున్న తరుణంలో గుంటూరు జిల్లా విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. జిల్లాలోని 150 పరీక్షా కేంద్రాల్లో 29,459 మంది రెగ్యులర్, ప్రైవేటుగా మరో 961 మంది విద్యార్థులు తమ భవిష్యత్తు ఆశలతో పరీక్షలు రాశారు. ఇప్పుడు ఫలితాల వేళ… ఒక్కో సెకనూ గంటలా మారింది. ప్రతి ఒక్కరికీ తమ ఫలితం మీద ఎన్నో ఆశలు.. ఎన్నో లక్ష్యాలు.. పెట్టుకుని ఉన్నారు. రిజల్ట్స్ కోసం Way2News ఫాలో అవ్వండి.
News April 21, 2025
గుంటూరు: పరీక్షల షెడ్యూల్ విడుదల

అచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎం.ఎడ్. నాల్గవ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ ను సోమవారం విడుదల చేసింది. పరీక్షలు ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు ఉదయం 10:30 నుంచి 1:30 వరకు జరుగుతాయని అధికారులు తెలిపారు. ప్రతి పేపరు 70 మార్కులకు ఉంటుంది. ముఖ్యమైన సబ్జెక్టులుగా టీచర్ ఎడ్యుకేషన్, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, హ్యూమన్ రైట్స్, వాల్యూ ఎడ్యుకేషన్ ఉంటాయి. విద్యార్థులు పరీక్ష తేదీలను గమనించాలని సూచించారు.
News April 21, 2025
వినుకొండ: క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు.. యువకుడి మృతి

వినుకొండలో క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. శనివారం క్రికెట్ ఆడుతుండగా గౌస్ బాషా (చంటి) అనే యువకుడు గుండెపోటుతో కుప్పకూలాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా, కొద్దిసేపటికే మృతి చెందాడు. మూడేళ్ల క్రితమే వివాహమైన చంటి మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటన స్థానికంగా కలచివేసింది. ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు భౌతికకాయానికి నివాళి అర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు.