News July 5, 2024
అమరావతి కోసం తొలి వేతనాన్ని విరాళంగా ఇచ్చిన ఎంపీ కలిశెట్టి
అమరావతి అభివృద్ధి కోసం ఎంపీగా అందుకొన్న తొలి గౌరవ వేతనాన్ని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శుక్రవారం సీఎం చంద్రబాబుకు అందజేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబును నేడు ఎంపీ కలిశెట్టి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు రూ.1.57 లక్షల చెక్కును ఆయన చంద్రబాబుకు అందజేశారు. దీంతో ఎంపీని సీఎం అభినందించారు.
Similar News
News July 8, 2024
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాలు.. నేటి నుంచి దరఖాస్తులు
కేంద్ర ప్రభుత్వం పరిధిలో అగ్నివీర్, అగ్నిపథ్ స్కీం కింద ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో దరఖాస్తు చేసుకోవడానికి నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు జులై 8 నుంచి 28వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఉపాధి అధికారి కొత్తలంక సుధ వెల్లడించారు. ఈ మేరకు అవివాహిత యువత ఇంటర్, 10వ తరగతిలో 50 శాతం ఉత్తీర్ణత సాధించి ఉండాలన్నారు. మరిన్ని వివరాల కోసం agnipathvayu.cdac.in వెబ్సైట్ను సందర్శించాలన్నారు.
News July 8, 2024
శ్రీకాకుళం: ‘కల్కి బుజ్జి’ కారు పర్యటన రద్దు
శ్రీకాకుళం జిల్లాల్లో ప్రభాస్ ఫ్యాన్స్కు నిరాశ ఎదురైంది. ఇటీవల ప్రభాస్ నటించిన కల్కి సినిమాలోని బుజ్జి కారు ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా విశాఖ, విజయనగరం జిల్లాల్లో ప్రదర్శన చేపట్టారు. అయితే సోమవారం శ్రీకాకుళం జిల్లాకు బుజ్జి కారు రావాల్సి ఉన్నప్పటికీ కొన్ని సాంకేతిక కారణాల దృష్ట్యా కారు విజయనగరం నుంచి వెనక్కి వెళ్లిపోయినట్లు జిల్లా ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రతినిధులు సోమవారం తెలిపారు.
News July 8, 2024
ఎచ్చెర్ల: ప్రభుత్వ ITIలో 10న ఉద్యోగ మేళా
ఎచ్చెర్లలోని ప్రభుత్వ ఐటీఐలో ఈ నెల 10వ తేదీన ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ITI ప్రవేశాల జిల్లా కన్వీనర్ సుధాకర్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ITI ఏ గ్రేడ్లో ఉత్తీర్ణులైన వారు ఈ మేళాకు హాజరు కావచ్చని చెప్పారు. 18 నుంచి 35 ఏళ్ల వయసు కలిగిన ఆసక్తి గల అభ్యర్థులు 10వ తేది ఉదయం 9 గంటలకు విద్యార్హత ధ్రువపత్రాలతో పాటు బయోడేటా, రెండు సెట్ల జిరాక్స్ కాపీలతో హాజరు కావాలని సూచించారు.